ప్రస్తుతం అమెరికా చైనా మధ్య జరుగుతన్న వాణిజ్య యుద్ధం కారణంగా ఒక రకంగా ఇండియాకు చాల మంచి జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలను ఆ దేశం విడిచి రావాలని హుకుం జారీ కూడా చేశారు. ఈ కారణం వల్ల చైనాలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు వేరే దేశాలకు తరలిపోవాలనే ఆలోచనలు కూడా మొదలు పెట్టారు. 


ఈ  కంపెనీలలో  ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆపిల్. ఈ కంపెనీ నుండి వచ్చే ఫోన్లకు ఎంత క్రేజ్ ఉందో ప్రతి ఒకరి తెలిసిందే. ఇప్పుడు ఆపిల్ కంపెనీ చైనాను వదిలి భారత్ కు రావాలనే యోచనలో ఉన్నట్టు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రకటించారు. ఆపిల్ సంస్థ ఉత్పత్తులను అమెరికాలో డిజైన్ చేసి చైనాలో తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి జరిగేది. ఇప్పుడు మాత్రం  ఆ కంపెనీ భారత్ కు వస్తుందని ప్రపంచంలోనే ఐదు పెద్ద మార్కెట్ ఉన్న దేశాలలో భారత్ ఒకటని ఇంత పెద్ద మార్కెట్ ఉన్న భారత్ ను కాదని ఎక్కడకి పోవాల్సిన అవసరం లేదు అని అంటునారు.

భారత్ ఆపిల్ పెట్టుబడులు పెట్టడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే  హైదరాబాద్ లో నెలకొల్పి తన వ్యాపార కార్యకలాపాలు మొదలు పెట్టింది.
హైదరాబాద్ ఆపిల్ ఆఫీస్ లో మ్యాప్ పనులు కూడా జరుగుతాయని ఇక తయారీ మాత్రం తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ కానీ ఆంద్రప్రదేశ్ లోని శ్రీ సిటీలో కానీ జరుగుతాయి.

ఆపిల్ మాత్రమే కాదు శాంసంగ్ కంపెనీ కూడా ఇప్పుడు అక్కడి నుండి ఇండియా వచ్చే ఆలోచనలో ఉంది అని సమాచారం . ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా భారత్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.హైదరాబాద్ లో నిర్వహణ చాలా సులభంగా ఉందని ఇక్కడ ఉద్యోగులను కూడా పెంచాలి అనుకుంటున్నట్టు కుక్ తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: