పూర్తి వివరాల్లోకి వెళితే, తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేట లో 13 సంవత్సరాల బాలిక తన తల్లి, అన్నతో కలిసి జీవిస్తోంది. తన తండ్రి ఇటీవల కరోనా వచ్చి మరణించడంతో, కుటుంబంలో కలహాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.. అన్న ,చెల్లెలి మధ్య మనస్పర్ధలు రావడం ..తల్లి మందలించడం.. గొడవలకు కారణం అని తల్లితో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా మందలిస్తూ ఉండడంతో.. తీవ్ర మనస్థాపానికి చెందిన యువతి ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి బాత్రూంలోకి వెళ్లి , సోషల్ మీడియాలో సులభంగా ఎలా చనిపోవాలి? అని వీడియోలను వెతికిందట.
ఇక ఆ వీడియోలను చూసి అద్దం ముక్కతో ఎవరు లేనిది చూసి బాత్రూంలో గొంతు కోసుకుంది. ఇక రక్తం మడుగులో ఉన్న యువతిని చూసి ఒక్క సారిగా భయభ్రాంతులకు గురైన తల్లి ఆస్పత్రికి తరలించడం తో ఆ యువతి మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచింది. అయితే తన తల్లి మాట్లాడుతూ.. అంతకు ముందు రోజు బ్లేడుతో కోసుకుంటే త్వరగా చనిపోతారా..? కత్తితో కోసుకుంటే త్వరగా చనిపోతారా..? అని తన కూతురు తనని అడిగిందని, తను మందలించడంతో వెళ్ళిపోయింది.. అని చెప్పి బోరున విలపించింది.. ఇక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.