కరోనా మహమ్మారి సమయంలో ఆన్లైన్లో కలిసిన ఇద్ధరు వృద్ధ జంట వివాహ చేసుకున్నారు. వీరిద్ధరి కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జిమ్ ఆడమ్స్ (78 సంవత్సరాలు) మరియు ఆడ్రీ కౌట్స్ (79 సవంతరాల) అనే వృద్ధ జంట ప్రేమించుకున్నారు. ఆ తరువాత వివాహం కూడా చేసుకున్నారు. వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని నిజమైన ప్రేమకు అవధులు లేవు అని వీళ్ల కథ నిరూపించింది. కరోనా సమయంలో జిమ్ ఆడమ్స్ మరియు ఆడ్రీ కౌట్స్ డేటింగ్ యాప్లో ఆన్లైన్లో కలుసుకున్నారు. ఎనిమిది నెలల ప్రేమించుకున్న తరువాత, ఈ జంట సెప్టెంబర్ 25 న వివాహం చేసుకున్నారు.
జిమ్ కుమారుడు, JJ ఆడమ్స్ కూడా ట్విట్టర్లో వారి చిత్రాన్ని పోస్ట్ చేసారు. మరియు నెటిజన్లు తమ కథను పూర్తిగా ఇష్టపడడంతో అది వేగంగా వైరల్ గా మారింది. పోస్ట్ అప్లోడ్ చేయడంతో 1.5 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. అలాగే, అందమైన జంట అని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ నెటిజన్ ఆ జంటను ఆశీర్వదిస్తున్నారు.