ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలపైన ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ ధామి మరియు మంత్రి అజయ్ భట్తో ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ వానలతో నేపాల్కు చెందినటువంటి ముగ్గురు కూలీలతో సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు. దింతో వాతావరణం చక్క బడేవరకు వరకు హిమాలయాలలోని దేవాలయాలకు ఎవరు వెళ్లవద్దని అధికారులు వెల్లడించారు. అలాగే చంపావత్ జిల్లా కేంద్రం లోని సెల్ఖోలాలో అనే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒకరి ఇల్లు కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారని రాష్ట్రనికి చెందిన అత్యవసరమైన ఆపరేషన్ సెంటర్ తెలియ జేసింది.
అలాగే రిషికేశ్లోని చంద్రభాగ అనే వంతెనతపోవన్, ముని-కి-రేతి మరియు లక్ష్మణ్ జూలా, భద్రకాళి దాటడానికి ప్రయాణికులను,వాహన దారులను అధికారులు అనుమతించలేదు. యాత్రికులు ఎవరేనా వాతావరణం చక్కబడేవరకు వరకు రెండు రోజులు తమ యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలియ జేశారు. అలాగే రాష్ట్రము మొత్తం వరకు అన్ని పాఠశాలలు సోమవారం రోజు మూసివేశారు. అలాగే నంద దేవి బయోస్పియర్ రిజర్వ్ తో పాటుగా ఇంకా కొన్ని అటవీ విభాగాలతో కలిపి రాష్ట్రంలో ఉన్న ఎత్తైన ప్రాంతాలల్లో ట్రెక్కింగ్ మరియు పర్వతారోహణ వంటి కార్యకలాపాలపై నిషేదాన్ని విధించారు.