1). నేల పై కూర్చుని ఆహారం తినడం వల్ల, మనం తినే ప్లేట్ కింద ఉంటుంది కాబట్టి, మనం తినేటప్పుడు ప్రతిసారి ముందుకి , వెనక్కి కదులుతూ ఉంటాము. ఇలా భోజనం చేయడం వల్ల, పొట్ట లోపల ఉండేటువంటి కండరాలు బాగా కదులుతాయి. అప్పుడు మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.
2). ముఖ్యంగా కింద కూర్చొని భోజనం చేయడం వల్ల వెన్నపూస స్ట్రైట్ గా ఉంటుంది. దీంతో మెదడుకు సమాచారం సులువుగా చేరుతుంది.
3). ఇటీవల కాలంలో చాలా మంది నేలపై కూర్చొని భోజనం చేయడానికి ఇష్టపడడం లేదు.. కానీ ఎప్పుడైతే నేలపై మనం పద్మాసనం లో కూర్చుని భోజనం చేస్తామో.. అప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.. కాకుండా కుర్చీలపై, సోఫాలో కూర్చుని భోజనం చేయడం వల్ల గుండెకు రక్తప్రసరణ సరిగ్గా జరగక, గుండె పోటు వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి..
అంతేకాదు నేలపై కూర్చుని తినడం వల్ల కీళ్లు కూడా బాగా వంగడమే కాకుండా మనం కూడా చాలా ఆరోగ్యంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. చూశారు కదా..! నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఎంతటి ప్రయోజనాలు చేకూరుతాయో కాబట్టి ఇక నుంచి ప్రతి ఒక్కరు నేలపై కూర్చుని భోజనం చేయడం అలవాటు చేసుకోండి.