ఇక ఈ టి 20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్లోనే ఘన విజయం అందుకుంది రోహిత్ సేన. మొదటి మ్యాచ్లో టి20 వరల్డ్ కప్ గెలిచిన న్యూజీలాండ్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా ఈ మ్యాచ్ రాహుల్ ద్రావిడ్ మార్గనిర్దేశం లో టీమిండియా ఆడటం గమనార్హం. ఇక ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ తో ఇక భారత క్రికెట్ చరిత్రలో నవశకం ప్రారంభం అయింది అని చెప్పవచ్చు. ఇక మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా అన్ని విభాగాల్లో కూడా బాగా రాణించి ప్రత్యర్థికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సాధించింది.
అయితే లక్ష్య ఛేదనలో భాగంగా టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డగౌట్ లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఒక నెటిజన్ పోస్టు చేసిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. డాగౌట్ లో రాహుల్ ద్రవిడ్, కె.ఎల్.రాహుల్, సిరాజ్ తో కలిసి కూర్చున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే ఒక చిలిపి పని చేశాడు. తదేకంగా ఒకే వైపు చూస్తూ ఉండిపోయిన సిరాజ్ తలపై ఒక మొట్టికాయ వేసాడు. దీంతో ఒక్కసారిగా అవాక్కయిన సిరాజ్ లోలోపల నవ్వుకున్నాడు. రోహిత్ శర్మ ఇలా ఎందుకు చేశాడు అన్నది మాత్రం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.