ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరు అప్డేట్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఒకటైన ట్విట్టర్ వేదికగా తమ వ్యక్తిగత విషయాలను, తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటూ ఉండటం గమనార్హం. ఇలాంటి ట్విట్టర్ ను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ట్విట్టర్ సేవలు సక్రమంగా అందాలి అంటే ట్విట్టర్ ను అధికారికంగా ముందుకు నడిపించాల్సి ఉంటుంది. అలా మొన్నటి వరకు ట్విట్టర్ కి సీఈఓ గా జాక్ డోర్సే వ్యవహరిస్తూ ఉండగా.. తన పదవికి రాజీనామా చేశారు..అయితే ఈయన స్థానంలో భారత సంతతికి చెందినటువంటి పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈఓ గా నియమితులయ్యారు. ఇక ఈయన వార్షిక వేతనం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ట్విటర్ సీఈఓ గా పరాగ్ అగర్వాల్ సంవత్సరానికి రూ.7.5 కోట్లకు పైగా జీతం పొందుతున్నారని కంపెనీ యు ఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తాజాగా వెల్లడించడంతో ఈ వార్త కాస్త ప్రస్తుతం వైరల్గా మారుతోంది.అంతే కాదు కంపెనీలో పరాగ్ అగర్వాల్ రూ.94 కోట్ల విలువైన షేర్లను కూడా పొందుతున్నారు అని వెల్లడించింది. షేర్ల ను మరో మూడు నెలల గ్యాప్ లో 16 క్వార్టర్స్లో అందిస్తామని ప్రకటించారు..అంటే ఈయన ప్రతి సంవత్సరం రూ. 7.5 కోట్ల జీతం తో పాటు రూ. 94 కోట్ల విలువగల షేర్లను కూడా పొందడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పరాగ్ అగర్వాల్ పేర్లను పొందుతారు. ఇకపోతే ఇతడి కంటే ముందు జాక్ డోర్సే సంవత్సరానికి 1.40 మిలియన్ డాలర్ల జీతాన్ని పొందిన విషయం తెలిసిందే. ఇకపోతే పరాగ్ ఐఐటీ లో విద్యనభ్యసించి..మైక్రోసాఫ్ట్ , యాహూ, L& T ల్యాబ్స్ లో పని చేశారు. 2011 లో ట్విట్టర్ లో చేరి 2017 లో సీటీవో గా బాధ్యతలు చేపట్టాడు. కానీ కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే ట్విటర్ సీఈఓ గా మారడం అంటే అతని ప్రతిభకు ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: