ప్రేమ అనేది అసలు ఎవ్వరి మధ్య ఎప్పుడు ఎలా పుడుతుందో అనేది దేవుడు తప్ప ఎవ్వరూ చెప్పలేరు. ఈమధ్య కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువ అయ్యాయి. కొంతమంది పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటుండగా..మరికొంతమంది మాత్రం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు. ఎంతో గారాభంగా పెంచుకున్న కూతురు తమ మాట కాదనడంతో కొంతమంది తల్లిదండ్రులు దారుణాలకు తెగబడుతున్నారు. అమ్మాయిపై దాడి చేయడమో లేదా అల్లుడిని హతమార్చినటువంటి ఘటనలు మనం ఇది వరకే చూశాం. తాజాగా ఓ తండ్రి కూతురు ప్రేమ వివాహాం చేసుకోవడాన్ని తట్టుకోలేక కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన కుమారై బతికుండగానే ఆమెకు పిండం పెట్టాడు. అతను గుండు కూడా గీయించుకుని దిన కర్మలు కూడా నిర్వహించాడు. ఇక ఈ ఘటన మహాబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి అనే అమ్మాయికి అదే గ్రామానికి చెందని వెంకటేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

ఇంకేముంది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ దగ్గరి బంధువులే కావడంతో తమ ప్రేమను పెద్దలకు తెలియజేశారు. తమకు పెళ్లి చేయాలని తమ పెద్దలను కోరారు. అయితే అందుకు పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారు ఈ నెల 13 వ తేదీన పెద్దలకు తెలియకుండా ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమార్తె తమ మాట కాదని ప్రేమ పెళ్లి చేసుకోవడంతో భార్గవి తండ్రి కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన దృష్టిలో తన కూతురు చనిపోయిందని.. ఇక తనకు ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. కూతురు చనిపోయిందని గుండు గీయించుకుని ఆమె కర్మకాండలు జరిపించాడు. అంతేకాదు కూతురు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి కూడా ఘటించాడు. కూతురు బతికుండానే ఆ తండ్రి చేసిన పని ఆ గ్రామంలోనే పెద్ద చర్చనీయాంశమైంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ఘటన బాగా వైరల్‌గా మారింది. నెటీజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొంత మంది ఆ తండ్రి చేసిన పనికి మద్దతుగా కామెంట్లు పెడుతుండగా.. మరికొంతమంది మాత్రం కూతురుపై కోపం ఉండొచ్చు కానీ ఇలా చేయడం బాగలేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: