పారిన్ దేశాలలో మగవాల్ల అంగాలను పోల్చిన పండ్లు, కాయలను పండిస్తున్న సంగతి తెలిసిందే..అంతే కాదు..ఆయా దేశంలోని జనాలు కూడా వాటిని విపరీతంగా ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ సహకారం కూడా ఉండటంతో అక్కడ ఇలాంటి మొక్కలను ఎక్కువగా పండిస్తున్నారు. వేరే దేశాలలో వీటికి డిమాండ్ ఎక్కువే.ఇలాంటి వాటిని కాంబొడియా దేశంలో ఎక్కువగా పండిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వానికి పెద్ద సమస్య వచ్చింది.. ఆ దేశంలోని పెనిస్ ప్లాంట్స్‌ మనుగడకు ఆటంకం ఏర్పడింది..అచ్చం పురుషాంగాన్ని పోలి ఉండే ఈ మొక్క పుష్పాలను పట్టుకుని సెల్ఫీలు తీసుకునేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారు.
 

ముఖ్యంగా ఈ పువ్వులు అమ్మాయిలను ఆకర్షిస్తున్నాయి. ఈ డిమాండ్‌ మూలంగా అవి అంతరించిపోతున్నాయి. దీంతో 'నెపెంథెస్ హోల్డెని'గా పిలువబడే ఫాలిక్ ఆకారపు పెనిస్ ఫ్లవర్స్‌తో ఆడుకోవద్దని కాంబోడియా ప్రభుత్వం ఆ దేశ పౌరులను హెచ్చరించారు. కొందరు మహిళలు ఈ పూల మొక్కలను పీకెసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి.అందుకు సంభంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా కఠినమైన ప్రకటన విడుదల చేసింది. 'సహజ వనరులను ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ పీకేయడం వల్ల ఈ మొక్కలు అంతరించిపోతాయి. భవిష్యత్‌లో ఇలా చేయొద్దు' అని ప్రకటనలో పేర్కొంది..మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పింది.


 ప్రత్యేకమైన పువ్వులు గల ఈ మాంసాహార ఉష్ణమండల కాడ మొక్కలు సముద్ర మట్టానికి 600 మీటర్ల నుంచి 800 మీటర్ల ఎత్తులో పెరుగుతాయి.ఈ పూల ఆకారం కారణంగా వీటిని పెనిస్ ప్లాంట్‌'గా పిలుస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి రక్షిత జాతిగా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో స్థానికులు, పర్యాటకులు ఈ వృక్షజాలాన్ని నేల నుంచి పీకేసి సోషల్ మీడియాలో పోస్టుల కోసం సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా 129 రకాల కాడ మొక్కలు ఉన్నాయని, వాటిలో ఐదు కంబోడియాలోని పలు ప్రాంతాల్లో పెరుగుతాయని పర్యావరణ శాఖ ప్రతినిధి చెప్పారు. ఈ పూలను చూసెందుకు జనాలు ఎగబడటం విశేషం..అయితే చూసి ఆస్వాదించాలి కానీ వాటిని ఇలా చేయడం భావ్యం కాదు అని గుర్తు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: