అస్సాంలోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో చాలా అతలాకుతలం అవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు అన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి. ఇంకా అలాగే పలు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు వరద నీటిలో చిక్కుకొని ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.ఇక భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని 28 జిల్లాల్లో మొత్తం 24లక్షల మందికి పైగా ప్రజలు ఇప్పటికీ బాగా నిరాశ్రయులయ్యారు. ఇంకా అలాగే క్యాచర్ జిల్లాలోని సిల్చార్ పట్టణం వంటి అనేక ప్రాంతాలు ఇప్పటికీ ఒక వారం కంటే ఎక్కువ నీటిలోనే ఉన్నాయి. అలాగే గడిచిన 24 గంటల్లో మరో ఐదు మరణాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు అస్సాంలో వరదలు ఇంకా కొండచరియలు విరిగిపడటంతో  ఏకంగా మొత్తం 139 మంది చనిపోయారు.అసలు అస్సాంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు ఇంకా నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో ఓ పోలీస్ స్టేషన్ కూడా నదిలో కుప్పకూలిపోయింది. బ్రహ్మపుత్ర నదికి వరదనీరు బాగా పోటెత్తింది. 


భారీ వరద కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించడం జరిగింది. అయితే నల్బరీ జిల్లాలో నదికి ఆనుకొని ఆ పోలీస్ స్టేషన్ భవనం ఉంది. నదిలో భారీ వరద కారణంగా రెండంతస్తుల భవనంలో సగభాగం అనేది నీటిలో మునిగిపోయింది. నది ఒడ్డుభాగం భారీకోతకు గురికావడంతో ఆ పోలీస్ స్టేషన్ భవనం స్థానికులు చూస్తుండగానే పేకమేడలా కూలిపోయింది.ఇంకా భవనం నదిలో కూలిపోతున్న దృశ్యాలను గ్రామస్తులు ఫోన్ లలో బంధించారు. ఇక వాటిని పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి బాగా వైరల్ గా మారాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి కూడా అసలు ఎలాంటి హాని జరగలేదు.ఇక గత రెండు వారాలుగా వర్షాల కారణంగా అస్సాంలోని పలు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి.ఇంకా నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో ఇక ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాసైతం పూర్తిగా నిలిచిపోయింది. ఇంకా అలాగే వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తుంది.ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: