వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం కొందరు కొన్ని రకాల ఆఫర్లను ప్రకటిస్తారు.. అంతేకాదు కస్టమర్లను ఆకర్షించేలా ఎన్నెన్నో భారీ ఆఫర్లను ప్రకటిస్తారు.. కొన్నిటిని చూసి జనాలు వస్తే మరి కొన్నిటిని చూసి అస్సలు ఎవరూ రారు. ఈ మధ్య వ్యాపారులు వింత ఆఫర్లను మాత్రమే కాదు వింత కండిషన్లను కూడా పెడుతున్నారు..మొన్న ఓ వ్యాపారి కేజీ చికెన్ కొంటే 4 గుడ్లు ఫ్రీ అని పెట్టాడు. ఆ తర్వాత బిర్యానికి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయని అంటున్నారు.హోటల్లో బిర్యానీ తింటే కోక్ లేదా పెప్సీ ఉచితమన్న ప్రకటనలు కూడా మీరు చూసే ఉంటారు. అయితే.. ఓ వ్యక్తి తన రెస్టారెంట్లో పెట్టుకున్న ఓ ప్రకటన కస్టమర్లను విస్తుపోయేలా చేస్తోంది.


అయితే.. అతని చేసిన ఈ ప్రకటన వెనుక బలమైన కారణం లేకపోలేదు. కొందరు చిన్న, చిన్న ఆర్డర్లు ఇచ్చి గంటల తరబడి ఏసీ రెస్టారెంట్లో గడపడంతో ఎక్కువ బిల్లు వస్తుందని ఇలాంటి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాడు.ప్రస్తుతం ఆ రెస్టారెంట్ ఓనర్ పెట్టిన కండిషన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏం రాశారంటే.. ఎగ్ బుర్జి, కోడిగుడ్డు కర్రీ, ఎగ్ ఆమ్లెట్, 250 గ్రాముల చికెన్ పకోడీ ఆర్డర్లపై ఏసీ ఆన్ చేయమంటూ ఎలాంటి మొహమాటం లేకుండా కస్టమర్లకు తేల్చిచెప్పాడు. అంటే చిన్న ఆర్డర్లకు ఏసీ పనిచేయదని.. ఏసీ ఆన్ కావాలంటే భారీ ఆర్డర్లు ఇవ్వాల్సిందేనని చెప్పకనే చెప్పేశాడు.


ఈ ఫొటోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. కొందరు రెస్టారెంట్ యజమాని నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం మరీ అలాంటి నిర్ణయం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. డబ్బే ధ్యేయం అన్నట్లు ప్రవర్తిస్తే వచ్చే కస్టమర్లు కూడా రారంటూ రెస్టారెంట్ యజమానికి వార్నింగ్ ఇస్తున్నారు..వంద రూపాయల ఆర్డర్ చేసి గంటలు గంటలు సొల్లు చెప్పుకుంటూ వస్తున్న వారి ఆట కట్టించాలంటే ఇలాంటి ఆలోచన తప్పదని కొందరు సమర్దిస్తున్నారు.ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ మొత్తానికి వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: