ఎంత డబ్బు ధనం ఉన్న గుణం మంచిది కాకపోతే మనిషి ఎప్పటికీ గొప్పవాడు కాలేడు అని చెబుతూ ఉంటారు పెద్దలు.  నిజంగానే ఎంతో మంది విషయంలో ఇది నిజం అవుతూ ఉంటుంది అని చెప్పాలి. కొంతమందికి ఎంతో డబ్బు ఉన్నప్పటికీ కూడా ఎంతో  పిసినారి తనంతో ఉంటారు. అలాంటి వారిని లోకమంతా పిసినారులు అంటుంది తప్ప గొప్పవారు అని మాత్రం ఎప్పుడూ కీర్తించ లేదు అని చెప్పాలి. ఇంకొంతమంది కాస్త డబ్బు ఉన్నప్పటికీ నీచమైన పనులు చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా ఇలాంటి వాళ్ల గురించే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎవరైనా సరే కాస్త డబ్బులు ఉంటే హాయిగా కార్ కొని కాస్త లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలని భావిస్తూ ఉంటారు. ఇక లగ్జరీ లైఫ్ లోకి అడుగు పెట్టిన తరువాత కాస్త హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  కానీ ఇక్కడ మాత్రం ఏకంగా కారులో దర్జాగా వచ్చి నీచమైన  పనిచేశారు. ఏకంగా దొంగతనానికి పాల్పడ్డారు అని చెప్పాలి.  ఇక వీళ్ళు చేసిన పని చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.. ఇంతకీ వీరు దొంగతనం చేసింది ఏంటో తెలుసా ఏకంగా పాల ట్రేలు.


 ఇందుకు  సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోతూ ఉండడంతో ఇది చూసి నెటిజన్లు కారులో వచ్చి ఇదేం పాడు పని అంటూ తిట్టిపోస్తూ  ఉండటం గమనార్హం. చోరీకి  కాదేది అనర్హం అన్న చందంగానే పాల ట్రే లను  సైతం ఎత్తుకెళ్లారు. ఇక ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఆ దొంగ వ్యవహారాన్ని చూసి పోలీసులు సైతం విస్తుపోయారు అని చెప్పాలి. హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లా కేంద్రం శ్రీ బాలాజీ కిరణం ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి  ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ కెమెరా రికార్డు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: