సాధారణం గా అడవుల్లో ఉండే క్రూర మృగాలు అంటే చాలు ఎవరికైనా వెన్ను లో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే సింహాలు పులులు లాంటివి ఇక తమ ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఎంత దారుణంగా వేటాడుతూ ఉంటాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలి కాలం లో చిరుత పులులు లాంటి క్రూర మృగాలు అటు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం  లోనే ఇక జనావాసాల్లోకి వచ్చి ఏకంగా దాడి చేసి గాయ పరచటం లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి.


 అయితే ఇలా చిరుత పులులు అడవులను వదిలి జనావాసాల్లోకి రావడం లాంటి ఘటనలు ఇప్పటివరకు వెలుగులోకి వచ్చాయి. కానీ సింహాలు పులులు ఇలాంటి క్రూరమృగాలు జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు మాత్రం చాలా అరుదు. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటిదే జరిగింది. అడవికి రాజు అయిన సింహం జనావాసాల్లోకి వస్తే అందరూ వణికిపోతుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇంటి పైనే సింహం ఉంది అని తెలిసినప్పటికీ ఇంట్లో వాళ్లు మాత్రం కాస్తయినా భయపడలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో తెగ చక్కెర్లు కొడుతుంది.


 ఒక కుటుంబం నివసిస్తున్న ఇంటి పైన సింహం అక్కడే కూర్చొని చుట్టుపక్కల పరిసరాలన్నీ పరిశీలిస్తోంది.. ఇలాంటి సమయంలో చుట్టుపక్కల వారు ఇక సింహం వైపు టార్చ్ లైట్ కొట్టి అక్కడ సింహం ఉంది అని కుటుంబాన్ని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఆ కుటుంబం మాత్రం అది పెద్దగా పట్టించుకోలేదు. ఇక రోజు వారీ కార్యకలాపాలలో బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారిపోయింది. సింహాలు మనుషుల మధ్య సహజీవనానికీ ఇది ఉత్తమమైన మార్గం అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా ఆ కుటుంబ సభ్యులు ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: