ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బస్ కండక్టర్ ఇంకా ఓ ప్రయాణికుడు కొట్టుకుంటున్న వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇక ఆ ప్రయాణికుడి నుంచి ఆర్టీసీ బస్సు కండక్టర్‌ రూ.5 ఎక్కువగా వసూలు చేశాడు. తాను ఓ స్టాప్ లో బస్సు దిగాల్సి ఉందని ప్రయాణికుడు చెబితే అతడు చెప్పిన స్టాప్ కంటే దూరం ఉండే మరో స్టాప్ కి కండక్టర్ టికెట్ ఇచ్చాడు.ఈ విషయాన్ని నిలదీసి అడిగిన ప్రయాణికుడితో కండక్టర్ తగాదాకి దిగడంతో ఈ గొడవ చెలరేగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఎన్సీసీ యూనిఫాంలో ఉన్న ఓ కుర్రాడు మధ్యప్రదేశ్ భోపాల్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ బస్టాప్ వద్ద బస్సు ఎక్కాడు.కండక్టర్ ను టికెట్ ఇవ్వాలని అడిగాడు. అతడు దిగాల్సిన స్టాపునకు రూ.10 టికెట్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, అయితే, కండక్టర్ రూ.15 టికెట్ ఇచ్చాడని సమాచారం.ఎన్సీసీ యూనిఫాంలో ఉన్న ఆ కుర్రాడుకి దిగాల్సిన స్టాపు కంటే దూరంగా ఉండే స్టాపునకు కండక్టర్ టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తన రూ.5 వెనక్కి ఇవ్వాలని ఆ కుర్రాడు అడిగాడు. అయితే, తాను ఇవ్వబోనని కండక్టర్ చెప్పాడు.దీంతో గొడవ చెలరేగింది. 


కండక్టర్ తీరుతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ కుర్రాడు అతడిపై పిడిగుద్దులు కురిపించాడు.కండక్టర్ బస్సులోని సీటుపై పడిపోయాడు. అనంతరం ఆ కుర్రాడు బస్సు దిగాడు. అయితే, ఆ కుర్రాడి వెనకాలే కండక్టర్ పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కండక్టర్లకు అధికారులు టార్గెట్లు విధిస్తుండడంతోనే ప్రయాణికులకు ఇలా అధిక రేటు టికెట్లు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఆర్టీసీ నుంచి ఫిర్యాదు అందింది. అయితే, ఆ కుర్రాడు దిగాల్సిన స్టాపునకు టికెట్ ఖర్చు రూ.15 అవుతుందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.దీని గురించి ఇంకా నిజ నిజాలు తెలియాల్సి వుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: