ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమకు కావాల్సిన వస్తువులను తీసుకోవడానికి  ఆన్లైన్ యాప్స్ పైనే ఎక్కువగా ఆధార పడుతూ ఉన్నారు  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులను ఎంతో సులభంగా వేగంగా డెలివరీ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేసేందుకు డెలివరీ బాయ్స్ ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కాగా కొంతమంది డెలివరీ బాయ్స్ పని పట్ల ఎంతో నిబద్ధతతో ఉండడం.. అప్పుడెప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఒక డెలివరీ బాయ్ చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. వేగంగా వెళ్తున్న రైలు లో ఉన్న కస్టమర్ కోసం డెలివరీ బాయ్ పరుగులు పెడుతూ వెళ్లి ఆర్డర్ డెలివరీ చేయడం గమనార్హం.  ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇక ఇలా కస్టమర్కు డెలివరీ ఏజెంట్ వస్తువును అందించగానే భారీ విజయం సాధించినట్లుగానే సంతోషం లో మునిగిపోయాడు అని చెప్పాలి. ఈ ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది.
.
 వైరల్ గా మారిన వీడియోలో చూసుకుంటే డెలివరీ బాయ్ పరుగులు పెడుతూ కనిపిస్తాడు. అంతలోనే రైల్వే ప్లాట్ ఫాం పై రైలు నెమ్మదిగా కదులుతోంది. క్రమక్రమంగా వేగం పెరిగింది. ఇంతలోనే డెలివరీ బాయ్  పరిగెత్తుకుంటూ ప్లాట్ఫారం పైకి  వచ్చాడు. రైలు డోర్ దగ్గర నిలబడి ఒక మహిళ డెలివరీ బాయ్ ను ఫాస్ట్ ఫాస్ట్ అంటూ రెండు చేతులతో సైగ చేసింది. రైలు తో పాటు వేగంగా పరిగెత్తి చివరికి కస్టమర్ చేతికి వస్తువును అందించాడు డెలివరీ బాయ్. దీంతో ఎంతో సంతోషపడ్డాడు. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు తోపు బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు ఎంతో మంది నెటిజెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: