ఇటీవలి కాలంలో మనుషులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనిషి రూపంలో ఉన్న మానవ మృగాల అనే విధంగా మారిపోయింది. పరిస్థితి సాటి  మనుషుల విషయంలోనే కాదు మూగజీవాల విషయంలో కూడా కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు నేటి రోజుల్లో మనుషులు. శుభం తెలియని మూగజీవాలను దారుణంగా హింసిస్తున్న ఘటనలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఎన్నో జంతువులను ప్రేమగా పెంచుకుంటా ఉంటే.. ఇంకొంత మంది మాత్రం మూగజీవాలను ఉసురు పోసుకుంటున్నారు.


 రాజస్థాన్లోని జోధ్పూర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అతను ఒక డాక్టర్ సాధారణంగా మనుషుల ప్రాణాలను కాపాడుతూ  ఉంటాడు. కానీ  మానవత్వం చూపించాల్సిన డాక్టర్ అమానుషంగా ప్రవర్తించాడు. ఇతను చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది.  డాక్టర్గా పనిచేస్తున్న రజనీష్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో ఒక వీధి కుక్క ఉంది. ఆ కుక్క అతని ఇంటి దగ్గర ఉండటం అతనికి అస్సలు ఇష్టం లేదు.


 ఈ క్రమం లోనే ఆ డాక్టర్ కుక్క మెడకు తాడు కట్టి ఆ తర్వాత ఆ తాడును  కార్ కు కట్టుకుని వేగంగా నడుపుకుంటూ రోడ్డుపై వెళ్ళాడు. ఆ కుక్క వెనకాల పరిగెత్తే లేక తీవ్ర ఇబ్బంది పడింది. అయినప్పటికీ కారు ఆపకుండా  అలాగే వెళ్లడంతో రోడ్డుపై జారి పడి తీవ్ర గాయాలపాలైంది కుక్క. ఆ సమయంలో కారు వెనకాల వెళుతున్న ఒక వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. స్పందించిన డాగ్ హోమ్ పౌండేషన్ వాళ్ళు కుక్కకు చికిత్స అందించారు. అతనిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ సెన్సేషనల్ గా  మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: