ఒక వ్యక్తిని మహిళలకు నిర్దాక్షిణ్యంగా రౌండప్ చేసి దారుణంగా కొట్టారు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి రాయపూర్ లోని స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది అనేది తెలుస్తుంది. వీడియో లో కనిపించిన దృశ్యాలు చూస్తే కోపం తో ఉన్న పలువురు మహిళలు డబ్బు వివాదంతో ఒక వ్యక్తిని దారుణంగా చితక్కొట్టారు. బెల్టుతో కొట్టడమే కాదు చెంపదెబ్బలు కొడుతూ అతని బట్టలు మొత్తం చింపేసారు.
అతను వారి నుంచి పారిపోయేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ మహిళలు మాత్రం అతని వదలక పోవడం గమనార్హం. చివరికి మహిళల గుంపు నుంచి తప్పించుకున్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్లో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. కాగా ఈ ఘటనపై ప్రస్తుతం ఇరు వర్గాలు కూడా రాయపూర్ నగరంలోని మన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం గమనార్హం. ఇక బాధితుడు పేరు రాహుల్ అనీ.. అతడు ట్రావెల్స్ కంపెనీలో టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు అన్న విషయం తెలుస్తుంది. బకాయి డబ్బులు వసూలు చేసే సమయంలో మహిళలు దాడి చేసినట్లు సదరు వ్యక్తి చెబుతున్నాడు.