న్యూఢిల్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పబ్ లోకి ప్రవేశంపై కొందరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. దీంతో విచక్షణ కోల్పోయిన బౌన్సర్లు వారిపై పిడి గుద్దులు కురిపించారు ఇదంతా సీసీటీవీలో రికార్డు అయింది అని చెప్పాలి. దేశ రాజధాని ఢిల్లీలోని నైట్ క్లబ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సౌత్ ఎక్స్టెన్షన్ లోని ఒక పబ్ ప్రవేశం వద్ద బౌన్సలతో వాగ్వాదానికి దిగారు కొంతమంది వ్యక్తులు. దీంతో ఒక వ్యక్తి చెంపపై బౌన్సర్ కొట్టాడు. అనంతరం వారంతా పబ్ ముందు ఉన్న రోడ్డుపైకి చేరారు. దీంతో అక్కడున్న వ్యక్తులు బౌన్సర్ల మధ్య ఫైటింగ్ జరిగింది.
ఇక అక్కడున్న మహిళలు బౌన్సర్లతో ఘర్షణకు దిగడం గమనార్హం. కాగా ఆడ మగ అనే తేడా చూడకుండా బౌన్సర్లు ఆడవాళ్ళపై కూడా దాడికి పాల్పడిన ఘటన సంచలనగా మారిపోయింది. ఇక ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులతో పాటు ఒక మహిళ తీవ్రంగా గాయపడింది అన్నది తెలుస్తుంది. ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే అక్కడ బౌన్సర్లు తన దుస్తులు చింపి వేశారని ఆరోపించింది సదరు మహిళ. ఈ క్రమంలోని ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తుంది. కాగా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే దాడి చేసిన బౌన్సర్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.