ఇటీవల కాలంలో మనిషి ప్రాణాలకు అస్సలు గ్యారెంటీ లేకుండా పోయింది అన్నది నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఒకప్పుడు అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక ఎన్ని అవాంతరాలు  ఎదురైనా బ్రతికేయొచ్చు అని అనుకునేవారు అందరూ.  ఇక వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోవడం తప్ప అప్పటివరకు ప్రాణాలు కోల్పోవడానికి పెద్ద కారణాలు ఉండవు అని అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు అంతకుమించి సంతోషంగా నవ్వుతూ ఉన్నవారు సైతం ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తూ ఉంటే అందరూ షాక్ అవుతున్నారు.


 కేవలం క్షణకాల వ్యవధిలోనే సంతోషంగా ఉన్న చోటే కుప్పకూలిపోయి ప్రాణాలు విడుస్తూ ఉండడంతో.. ఇక ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిపోతోంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇక బంధుమిత్రులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంతలో ఊహించని విషాదకర ఘటన జరిగింది. ఏకంగా వరుడు తాళి కట్టాడో లేదో మరు క్షణంలో ఇక వధువు కుప్పకూలిపోయింది. దీంతో ఏంటా అని భయపడి ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించారు.


 పెళ్లి కావడంతో కాస్త అలసట కారణంగా అలా స్పృహ కోల్పోయిందని భావించారు. కానీ చివరికి వధువు తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. బద్వాన గ్రామానికి చెందిన రాజ్ పాల్ కూతురు శివాంగికి వివేక్ తో పెద్దలు పెళ్లి ఖాయం చేశారు. ఇక పెళ్లి జరుగుతున్న సమయంలో వరుడు వధువు మెడలో తాళికట్టాడు. ఇక ఇద్దరు పూలమాలను మార్చుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది యువతీ. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ యువతీని పరీక్షించిన వైద్యులు మార్గమధ్యమంలోనే మృతి చెందినట్లు తెలిపారు. గుండెపోటు కారణంగానే వధువు చనిపోయిందని వెల్లడించారు. దీంతో సంతోషంగా ఉన్న పెల్లింట విషాదఛాయలు అలముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: