లోకంలో మనుషులకు రాను రాను మానవత్వం పూర్తిగా నశించిపోతుంది.. పూర్తిగా అడవిలోని కౄరమృగాళ్ల మారుతున్నారు.. మంచితనం అనే మాటను నేరమైనట్లుగా చూస్తున్నారు.. ఇలాంటి కౄరులు రోడ్డెక్కారంటే అసలు రోడ్డుమీద ఉన్నది మనుషులు అన్న విషయమే మరచి పోతున్నారు.. ఇప్పటికే పీకల దాక మద్యం తాగి కార్లతో ప్రాణాలు తీసే వారిని చూసాము.. వాహనాలు ఏవైన కనీసం తమ ముందు మనుషులున్నారా.. జంతువులు ఏవైనా ఉన్నాయా అనే ధ్యాస లేకుండా వాహన చోదకులు పరుగులుపెడుతున్న తీరు భయాన్ని గొల్పుతుంది..

 

 

ఇక కొన్ని చోట్ల అయితే రోడ్డుదాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసి వస్తుంది.. నగరాల్లో అయితే కనీసం రోడ్డు దాటాలంటే చాలా సమయం పడుతుంది.. ఈ మధ్యకాలంలో ఇలా రోడ్డు దాటుతూ ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.. అవయవాలు దెబ్బతిని వికలాంగులుగా మారిన వారు ఉన్నారు.. కొంతమంది డ్రైవింగ్ చేసే విధానం చూస్తే అసలు వీడు ఇంట్లో చెప్పివచ్చాడా అనే అనుమానం కలుగుతుంది.. అంత వేగం, నిర్లక్ష్యం అవసరమా.. ఈ మధ్యకాలంలో ఇలా రోడ్డు ప్రమాదాలు చాలా ప్రమాదకరంగా మారి అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి..

 

 

ఇకపోతే అహ్మదాబాద్‌లో ఒకడు మనిషిని అనే సృహలేకుండా వాహనాన్ని నడిపి రోడ్డు దాటుతున్న ఓ యువతిని గాయాల పాలు చేసాడు.. అతనెవడో గాని ఎంత నిర్లక్ష్యంగా బైక్ పై వెళ్లుతున్నాడంటే, ఒక అమ్మాయి తన బైక్ తాకి కిందపడింది అనే మానవత్వం లేకుండా తనకేమి పట్టనట్లుగా, రోడ్డు మీద పడిన ఆమె కడుపు మీద నుంచి బైకును నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది.

 

 

ఈ ప్రమాదంలో యువతి పొత్తి కడుపులోని వెన్నుముక భాగం విరిగడమే కాకుండా, ఎడమ మోకాలికి గాయమైంది. ఇకపోతే సీసీటీవీ కెమేరాలో బైకు నెంబరు కనిపించలేదు. దీంతో పోలీసులు ఆ బైకు నడిపిన ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోలేక పోయారు. కానీ అన్యాయంగా ఒక అమ్మాయిని ఇంత దారుణంగా గాయపరచిన ఇలాంటి వాడిని ఊరికే వదల కూడదని నెటిజన్స్ కోపంతో ఊగిపోతున్నారు.. ఇక ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: