మామూలుగా కోతులు చేసే చేష్టలు అన్నీ ఎంతో వింతగా ఉంటాయి అనే విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు కోతులు చేసే చేతులు నవ్వు తెప్పిస్తే కొన్నిసార్లు కోపం తెప్పిస్తాయి. అందుకే మనుషులను తిట్టాలి అన్న కోతి చేష్టలు చేయకు అని చెబుతూ ఉంటారు. ఇలా ఎప్పుడూ విచిత్రంగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాయి కోతులు. మనుషులు ఉన్నా లేకున్నా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. ఇక ఇప్పుడు కూడా ఇక్కడ ఒక కోతి తెగ ఎంజాయ్ చేస్తోంది . ప్రస్తుతం భారతదేశంలో లాక్ డౌన్ లో కొనసాగుతున్న నేపథ్యంలో మనుషులెవరూ బయట తిరగడం లేదు. దీంతో మూగజీవాలకు ఎప్పుడూ లేనంతగా స్వేచ్ఛ వచ్చింది. ఈ క్రమంలోనే ముంబైలోని బోరివాలిలో స్విమ్మింగ్ పూల్ లో ఫుల్ పార్టీ చేసుకున్నాయి కోతులు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
మనుషులు ఎవరులేనిది చూసి ఎంతో స్వేచ్ఛగా కోతులు పార్టీ చేసుకున్న వీడియోలు చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఇక ఈ వీడియో క్లిప్ ని ఇంస్టాగ్రామ్ లో టిస్కా చోప్రా అనే వ్యక్తి షేర్ చేశారు. #poolparty అనే హ్యాష్ టాగ్ తో వీడియో తప్పక చూడండి అంటూ పోస్ట్ చేశారు టిస్కా చోప్రా అనే వ్యక్తి. ఈ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా.... కోతులు ఎప్పటిలాగే తన బుద్ధి చూపించింది. కానీ కాస్త వెరైటీగా ఆలోచించింది. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చేరుకున్న కోతి... చుట్టుపక్కల మనుషులెవరూ కనిపించకపోవడంతో... ఇదే సరైన సమయంగా భావించి స్విమ్మింగ్ పూల్ లోకి దూకింది.
మనుషులు ఎవరు లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లుగా స్విమ్మింగ్ పూల్ లో ఈదుతూ తెగ ఎంజాయ్ చేసింది ఆ కోతి . ఆ తర్వాత పక్కకు వెళ్ళి హాయిగా సేద తీరింది . ఇక ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా.. క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఎంతో మంది నెటిజన్లు దీనిపై ఫన్నీ కామెంట్ కూడా పెడుతున్నారు. ఎన్ని రోజులనుంచి వెయిట్ చేస్తుందో ఇక ఇప్పటికీ ఆ కోతికి సరైన సమయం దొరికింది అంటూ నెటిజన్ల కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.