ఈ కరోనా.. వ్యాధి సోకిన వారికంటే మిగతా వారిని చాలా బాధపెడుతున్నట్లుగా ఉంది.. ఎందుకంటే వైరస్ సోకిన వారు ఎలాగైనా బ్రతికి బట్టకట్టాలని ఆరాటపడుతుంటే.. లాక్‌డౌన్‌లో ఉన్న పేదలు కడుపునిండా తిండి కోసం అలమటిస్తున్నారు.. ఈ రెండు విషయాలు నిజంగా మనసును కలిచివేసేవి.. కానీ ఇంకో రకం వారున్నారు.. అక్రమసంబంధాలు నెరిపేవారు.. లవర్స్‌ను మిస్సవుతున్న వారు.. వీరి బాధలో ఏమైన అర్ధం ఉందా చెప్పండి.. ఇప్పటికే సందు దొరికితే చాలు ఎంజాయ్ చేస్తున్న వీరిని ఏమనాలో పాఠకులకే వదిలేస్తున్నా..

 

 

అసలే ఇది కరోనా కాలం.. కనీసం ఆరోగ్యంగా బ్రతికే చాలు.. ఆ తర్వాత ఎన్ని వేషాలైన వేయవచ్చు.. కానీ కొందరు తాపాన్ని ఆపుకోలేక అడ్దంగా పోలీసుల కెమెరాలకు బుక్ అవుతున్నారు.. దీనివల్ల పోయిన పరువు తిరిగి వస్తుందా.. ఇక లోకమంతా లాక్‌డౌన్ అమలవుతుంటే.. రంకునేర్చిన వారు మాత్రం విరహంతో రగిలిపోతున్నారు. తమ ఇల్లీగల్ పార్ట్‌న‌ర్‌ను ఏదో ఒకలా కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, పోలీసు బందోస్తు గట్టిగా ఉండటం వల్ల అది సాధ్యం కావడం లేదు. అయితే, ఒక ప్రేమజంట పోలీసుల కళ్లు గప్పి ఎలా తప్పించుకున్నారో ఏమో గానీ.. నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లి, ఓ చెట్ట కింద కుర్చొని ముచ్చట్లు మొదలుపెట్టారు. కానీ, వాళ్ల బ్యాడ్ లక్.. వారిని డ్రోన్ రూపంలో వెంటాడింది.

 

 

వాళ్లు ఆదమరిచి తమలోకంలో ఉన్న సమయంలో సైలెంట్‌గా వారి కళ్ల ముందు డ్రోన్ ప్రత్యక్షమైంది. ఇంకేముంది ఆ డ్రోన్‌ను చూడగానే తమ ముఖాలకు ముసుగులు వేసుకుని, అక్కడి నుండి పరుగు పరుగున బైకు ఎక్కి పారిపోయారు. ఇకపోతే ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగినట్లు సమాచారం. లాక్‌డౌన్‌ ఉల్లంఘించేవారిపై నిఘా ఉంచేందుకు పోలీసులు.. ముఖ్యంగా తమిళనాడు పోలీసులు భారీ సంఖ్యలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో కూడా పెట్టగా వైరల్‌గా మారి చూసే వారికి నవ్వులు తెప్పిస్తున్నాయి.. ఇక ఈ ప్రేమ జంట వీడియో కూడా మీకు మాంచి వినోదం అందిస్తుంది కావచ్చూ.. వీక్షించండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: