చెడపకురా చెడేవు అనే సామేత అందరికి తెలిసిందే.. అంటే మనపని మనం చేసుకోకుండా ఇతరుల పనికి ఆటంకం కలిగిస్తూ, కావాలని ఇబ్బందులకు గురిచేస్తే దాని తాలూకు ఫ్రతిఫలం కాస్త లేటైనా అనుభవించక తప్పదు.. కొందరికైతే చేసిన పాపపు పనికి సంబంధించిన శిక్ష వెంటనే పడుతుంది.. అదీగాక నేటి సమాజంలో కొందరు స్వార్ధపరులు, మనసు అంతా చెడును నింపుకుని పైకి మాత్రం అతివినయాన్ని ప్రదర్శిస్తు బ్రతికేస్తున్నారు.. వారికి విలువలతో పనిలేదు.. తన పక్కవాడి బ్రతుకు మీద కొట్టైనా సరే తన కడుపు నింపుకోవాలని చూస్తాడు.. కానీ విధి అనేది ఒకటుందని తెలుసుకోలేని ఇలాంటి నక్కలు ఏదో ఒకరోజు వారి బండారం బయటపడిన నాడు కుక్కలకంటే హీనంగా కనిపిస్తారు..

 

 

ఇకపోతే కొందరు కుర్రాళ్లు చేసే పనులను చూస్తే ఒళ్లు మండుతుంది.. మనుషులను గానీ, జంతువులను గానీ ఇలా దేన్నైనా బాధపెట్టందే వాడికి కడుపు నిండేలా ఉండదు.. అందుకని మూగజీవులు కనిపిస్తే వాటిని రాచిరంపాన పెడుతున్నారు. ఇక టిక్ టాక్ కూడా తోడు కావడంతో కుక్కలు, పిల్లులపై ప్రతాపం చూపుతున్నారు. మరికొందరు బలుపుతో బర్రెలును కూడా హింసిస్తున్నారు. మనుషులు శిక్షించక పోయినా దేవుడు వాళ్లను బాగానే శిక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే క్షణాల్లో కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నారు.

 

 

ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా ఇలాంటిదే.. అది ఏంటంటే..బైక్‌పై వెళ్లుతున్న ఇద్దరు యువకుల్లో వెనసీట్లో కూర్చున్న ఓ పోరడు బలుపుతో బర్రెను తన్ని బొక్కబోర్లా పడ్డాడు. దారిపక్కన తన మానాన తాను నిల్చున్న ఆ బర్రెను తెగబలిసిన ఈ వెధవగాడు కాలితో తన్నాడు. అయితే ఆ బర్రెకు దెబ్బ తగిలిందో లేదోగాని ఆ ఊపులో డ్రైవింగ్ చేస్తున్న కుర్రాడు అదుపు తప్పడంతో ఇద్దరు కిందపడిపోయాడు. ఇంకా నయం వీళ్ల అదృష్టం బాగుండి పక్కనే ఉన్న కరెంటు స్తంభానికి తలలు తగలలేదు.

 

 

కాగా అక్కడ జరిగింది ఏమి తనకు తెలియని ఆ బర్రె చక్కగా నెమరేస్తూ ఉండిపోయింది. ఇకపోతే ఈ వీడియోను అటవీ శాఖ అధికారి సుశాంతా నందా పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.. అందుకే అంటారు పెద్దలు ఒకడి కొంప ముంచాలని చూస్తే భగవంతుడు అంతకంటే ఎక్కువే నిన్ను ముంచుతాడని.. ఈ సంఘటన చూస్తే నిజమే అనిపిస్తుంది కదూ..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: