మనిషి ప్రాణాలు గాలిలో పెట్టిన దీపాల వంటివి అన్న విషయం తెలిసిందే.. ఏ క్షణంలో ప్రమాదం ఎటు వైపు నుండి దూసుకు వస్తుందో తెలియదు.. ఏ మూల మలుపులో మృత్యువు కాచుకుని కూర్చుంటుందో అర్ధం కాదు.. అయితే ఎంతటి దారుణమైనా ప్రమాదాలు సంభవించినా కొందరు బ్రతికి బట్టకడతారు.. మరికొందరు చిన్న ప్రమాదాలు జరిగినా వాటిలో ప్రాణాలు కోల్పోతారు.. అయితే ఆ ప్రమాదం జరిగిన తీరు చూస్తే మాత్రం మనిషన్నవాడు బ్రతికే అవకాశం లేని విధంగా అక్కడి ఘటనలు కనిపిస్తాయి.. ఇలా భయాన్ని కలిగించేలా ఓ ప్రమాదం జరిగింది కానీ వారి అదృష్టం బాగుండి అందులో ఉన్న వారు పునర్జన్మను పొందారు.. ఆ వివరాలు చూస్తే..

 

 

తాజాగా సౌత్‌ వెస్ట్‌ చైనాలోని చాంగ్కింగ్ మున్సిపాలిటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.. ఇక్కడి రోడ్డు మీదనుండి వేగంగా వెళ్లుతున్న ఒక మినీ బస్‌ అకస్మాత్తుగా రోడ్డుపై అదుపు తప్పి బోల్తా కొట్టింది.. కాగా అలా పడిపోయిన ఆ వాహనం నుంచి దట్టమైనా పొగలు రావడం ప్రారంభం అయ్యాయి.. అయితే ఆ బస్సు పక్క నుండి ఎన్ని వాహనాలు వెళ్లుతున్నా ఒక్కరు కూడా ఈ ప్రమాదాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.. ఆ వాహనంలో ఉన్న వారిని కాపాడే ప్రయత్నం చేయలేదు..

 

 

అంతలోనే ఆ బస్సును మంటలు చుట్టుముట్టడం మొదలెట్టాయి. అయితే ఈ దృశ్యాన్ని చూసిన ఒక వ్యక్తి తక్షణమే స్పందించి ఆ బస్సులో ఉన్నవారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నంలో బస్సు అద్దాలు పగలగొట్టగా అందులో నుండి ఎలాగోలా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు.. ఇకపోతే ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియోను  సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.. ఏది ఏమైనా అదృష్టం అంటే వీరిదే.. కాసేపట్లో కాలి బూడిద అయ్యేవారు.. కానీ దేవుడిలా వచ్చిన ఆ వ్యక్తి క్షణాల్లో వీరిని రక్షించాడు..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: