ఇదిలా ఉండగా.. ‘బాపు గారి బొమ్మలా’ అలంకరించుకుని..ఆ టైములో తనను పెయింటింగ్ వేస్తే’ చూసుకోవాలని రాశీకి ఎప్పటి నుండో ఆశట. ఆ కల కెమెరామెన్ ఫోటోగ్రాఫర్ శ్రావణ్ కుమార్ ద్వారా నెరవేరిందని ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాదు.. తనని తాను ఆ ఫోటోలలో చూసుకుంటే, ఓ పాట కూడా పడాలని ఉందంటూ కూడా తన సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ ఫోటోలలో రాశీ నిజంగానే బాపు బొమ్మలా ఉంది.
‘రంగస్థలం’ చిత్రంలో రామ లక్ష్మీగా కనిపించిన సమంత లా మాదిరి కొంచెం రాశీ ఈ ఫోటోలలో కనిపిస్తుందని’ కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి...