ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... ఈ మధ్య కాలంలో వరుసగా ఫోటో షూట్లలో పాల్గొంటూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది రాశీ ఖన్నా. 2020 ప్రారంభంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ‘అరణ్మనై 3’ అనే తమిళ చిత్రంలో నటిస్తుంది. సుందర్.సి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం.. గతంలో వచ్చిన ‘చంద్రకళ’ ‘కళావతి’ చిత్రాలకి సీక్వెల్.ఇక కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలు చేసిన రాశీ..ఆ తరువాత వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘తొలిప్రేమ’ చిత్రంతో మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

ఇదిలా ఉండగా.. ‘బాపు గారి బొమ్మలా’ అలంకరించుకుని..ఆ టైములో తనను పెయింటింగ్ వేస్తే’ చూసుకోవాలని రాశీకి ఎప్పటి నుండో ఆశట. ఆ కల కెమెరామెన్ ఫోటోగ్రాఫర్‌ శ్రావణ్‌ కుమార్‌ ద్వారా నెరవేరిందని ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాదు.. తనని తాను ఆ ఫోటోలలో చూసుకుంటే, ఓ పాట కూడా పడాలని ఉందంటూ కూడా తన సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ ఫోటోలలో రాశీ నిజంగానే బాపు బొమ్మలా ఉంది.




‘రంగస్థలం’ చిత్రంలో రామ లక్ష్మీగా కనిపించిన సమంత లా మాదిరి కొంచెం రాశీ ఈ ఫోటోలలో కనిపిస్తుందని’ కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి...

మరింత సమాచారం తెలుసుకోండి: