ఈ వీడియో సాంగ్ వైరల్ కావడంతో.. ఆంథోనీ ఫీల్డ్ అనే వ్యక్తి స్పందించాడు. ‘‘ఈ పాటను రాసింది, డైరెక్ట్ చేసింది నేనే. దీన్ని 2014లో చిత్రీకరించాను. ఓ సెలబ్రేషన్ కోసం దీన్ని చిత్రీకరించాం. భారత సంస్కృతిని కించపరిచే ఉద్దేశంతో దీన్ని చేయలేదు. ఎవరినైనా నొప్పించి ఉంటే.. క్షమించండి’’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఆ పాటలో ఉన్న భారతీయ మహిళ.. చివరికి వరకు పళ్లు ఇకిలిస్తూనే ఉండటం ఈ పాటకు మరో హైలెట్. దీంతో అంతా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మొదటి నుంచి చివరి వరకు ఆమె ఎక్స్ప్రెషన్ మార్చకుండా.. టూత్ పేస్ట్ యాడ్లా దంతాలు చూపిస్తూనే ఉందని అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ పాటను ఈ కింది ట్వీట్లో చూసేయండి. దీనిపై నెటిజనుల స్పందనను కూడా చూసేయండి.