నేపాల్ లో ఉండే ఈ చోటు గురించి తెలిస్తే మీకు నిజంగా భయం వేస్తుంది సాహసం చేసే వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది..
చుక్క తేనె కోసం నేపాల్ గ్రామస్థులు గొప్ప సాహసాలే చేస్తున్నారు.. ఇంతకి ఏంటా సాహసం.?? నేపాల్ లోని ఒక కొండ ప్రాంతం తేనెటీగలకు నిలయాలుగా మారాయి... అయితే అక్కడ గుడిసెల్లో నివసించే ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి తేనె ని సేకరిస్తున్నారు.. ఇదే ప్రస్తుతం ఇక్కడి ప్రజల జీవనాధారం. దీని కోసమే వాళ్ళ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు . సుమారు 200 మీటర్ల ఎత్తులో నిచ్చెన పై వేలాడుతూ ఆ గ్రామస్తులు తేనెను సేకరిస్తున్నారు. రెప్పపాటులో కాలు జారిన మరణం సంభవించే ఈ చోటు గురించి తెలిస్తే మీకు నిజంగా భయం కలగడం ఖాయం. రోజుకు కొన్ని వేల తేనెటీగలు వారిని కుడుతున్న అవేమీ పట్టించుకోకుండా 200 మీటర్ల ఎత్తులో ప్రమాదపు అంచున ఉంటూ తేనె ను సేకరిస్తున్న వీరి యొక్క గుండె ధైర్యాన్ని మెచ్చుకోక తప్పదు. వీరి చేస్తున్న దాన్ని చూసేందుకు విదేశీ పర్యాటకులు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారని ఆ విదంగా వచ్చిన డబ్బుతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని వాళ్ళు చెబుతున్నారు...