అయితే ఇంకా టెస్టింగ్ లోనే ఉండడం వల్ల అందుబాటులోకి రాలేదు.అయితే తాజాగా భారత్లోనూ కోవిడ్కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ సిద్ధమవుతోందని.. ఇప్పటికే సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీ.. వ్యాక్సిన్పై సీఎంలతో చర్చించారు. ఒకవేళ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో సిద్దమైతే, అప్పుడు తొలి దశలో సుమారు 30 కోట్ల మంది భారతీయులకు ఆ టీకాను ఇవ్వనునట్టు సమాచారం..
దీనిపై భారత ప్రభుత్వం పక్క ప్రణాళిక సిద్ధం చేస్తోందట. అయితే ఈ కరోనా వ్యాక్సిన్ను ముందుగా కోవిడ్ బాదితులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.తరువాత హెల్త్ కేర్ వర్కర్లు, పోలీసులకు ఇవ్వనున్నారు.. ఆ తర్వాత 50 ఏళ్లు దాటిన వారితో పాటు అనారోగ్యంగా ఉన్న యువతకు కూడా ఈ టీకాను తొలి దశలో ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కే విజయ్ రాఘవన్ వెల్లడించారు.