తన అందంతోనే కాదు చలాకీతనంతో కూడా అందరినీ ఆకర్షించే ఈ టీవీ జబర్దస్త్ ఫేం హాట్ యాంకర్ కం నటి అనసూయ భరద్వాజ్ కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే ఈ ముద్దుగుమ్మ తన మనసులోని మాటలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే సాదారణంగా ఏ పేరెంట్ అయినా సరే ధనిక, పేద అనే తేడా లేకుండా.. తమకు ఇద్దరు పిల్లలు ఉంటే చాలని భావిస్తున్న ఈ రోజుల్లో ఈ హాట్ బ్యూటీ అనసూయ మాత్రం తనకు మూడో సంతానం కనాలని ఉందని పేర్కొంది. మూడోసారి గర్భం దాల్చడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని, మళ్లీ తల్లి కావాలనుందని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సాదారణంగా ఏ విషయమైనా, ఏదైనా కూడా మొహమాటం లేకుండా తిన్నగా మ్యాటర్ చెప్పేయడం అనసూయకు అలవాటు. ఆ తీరే ఆమెను చాలా సందర్భాల్లో ట్రోల్స్ బారిన పడేసింది. అయినా కూడా అనసూయ తన ప్రవర్తన మార్చుకోలేదు పైగా ఆ విదంగా మాట్లాడటం తనకు ప్లస్ పాయింట్ గా ఫీల్ అవుతూ అదేవిధంగా తన మనసులోని మాటను నిర్మొహమాటంగా బయటపెట్టేస్తోంది.



 

అలాగే మరోవైపు విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ వెండితెరపై కూడా సత్తా చాటుతున్న ఈ జబర్దస్త్ భామ.. ప్రస్తుతం “థాంక్యూ బ్రదర్” అనే మూవీ చేస్తోంది. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అందులో గర్భవతిగా కనిపించి షాక్ ఇచ్చింది అనసూయ. దీంతో అనసూయ మరోసారి గర్భవతి అయ్యిందంటూ సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఆమె.. మాతృత్వంలో ఉన్న ఆనందం గొప్పదని, మరోసారి గర్భవతి అయి ఆ మాతృత్వపు ఆనందం పొందాలని ఉందని తెలుపుతూ ఓపెన్ అయింది. గతంలో తన ప్రెగెన్సీ సమయంలో పొందిన ఆ అనుభూతి మరోసారి పొందాలని ఉందని, అందుకే మళ్లీ తల్లి కావాలని అనుకుంటున్నా అంటూ అనసూయ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె.. ఇప్పుడు మళ్లీ తల్లి అవుతా అని చెబుతుండటం ఈ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: