రాశీ ఖన్నా.... హీరో నాగసౌర్య సరసన హీరోయిన్ గా ‘ఊహలు గుసగుసలాడే’ వంటి క్యూట్ రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల బొద్దుగుమ్మ తర్వాత సాయి ధరం తేజ్ సరసన సుప్రీమ్ చిత్రంలో చేసిన బెల్లం శ్రీదేవి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జై లవకుశ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మధ్యలో కొన్ని వరుస ఫ్లాపులు ఇబ్బంది పెట్టినా.. తరువాత వెంకీమామ, ప్రతిరోజు పండగే చిత్రాలతో తిరిగి పుంజుకుంది. ఇక మరలా విజయ్ దేవరకొండ సరసన చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ తనని కొంత నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే... అయితే సోమవారం తన 30వ పుట్టినరోజు జరుపుకున్న ఈ బ్యూటీ రాశీ ఖన్నా.. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంది. తన ప్రేమ వైఫల్యం గురించి చెప్పింది.. అలాగే ఎవరితోనైనా డేటింగ్ చేయాలని ఉందంటూ తన మనసులోని మాటను చెప్పి ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది.





‘ప్రేమ సక్సెస్‌ అవ్వడం అనేది అరుదుగా జరుగుతుందని, ప్రేమలో ఫెయిల్యూర్సే ఎక్కువని... అలాంటి చేదు అనుభవం తనకూ ఉందని రాశీఖన్నా గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే స్కూల్‌ డేస్‌లో తన సీనియర్‌‌తో ఆమె ప్రేమలో పడగా.. కొన్ని కారణాల వల్ల అది విఫలమైందని తెలిపింది. ఇక ఆమె పుట్టినరోజు నాడు ఆమెకు విషెస్ చెప్పిన అభిమానులు.. ఇప్పుడు ప్రేమలో ఉన్నారా?  అని అడుగగా... ‘ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. ఇప్పటికి నా జీవితంలో ఎవరూ లేరు. నిజం చెప్పాలంటే ఎవరితోనైనా డేటింగ్‌ చేయాలని ఉంది. ఆ అనుభవం ఎలా ఉంటుందో ఆస్వాదించాలని ఉంది. కానీ ఎందుకో ఆ వైపు వెళ్లలేకపోతున్నా’ అని చెప్పుకొచ్చింది రాశీఖన్నా. ఈ అమ్మడి వరుస చూస్తుంటే త్వరలోనే ఎవరితోనో ప్రేమలో పడేలాగా కనిపిస్తోంది. అంటూ నెటిజన్లు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: