ఈ ఒప్పందానికి అంగీకరించే అభ్యర్థిని ‘వెగాన్ క్యూరియస్ కోర్డినేటర్’గా అపాయింట్ చేసుకుంటామని తెలిపారు. అతను తాము అందించే శాఖాహారాన్ని రుచి చేసి అది రుచికరంగా ఉంటుందో వివరించాల్సి ఉంటుందన్నారు.ప్రతి రోజు మాంసం మాత్రమే భోజనం చేసే వ్యక్తి అకస్మాత్తుగా శాఖాహారిగా మారడమనేది చాలా కష్టమని, దానివల్ల సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటిస్తామని బ్యూర్కే తెలిపారు.
మాంసాహారం తినడం వల్ల ఎంత శాతం పోషకాలు అందుతాయో.. అంతే సమానమైన శాఖాహారాన్ని ఆ వ్యక్తికి అందిస్తామన్నారు. మూడు నెలలు ముగిసిన తర్వాత అతడు తనకు నచ్చిన ఆహారాన్ని తినొచ్చని తెలిపడం జరిగింది.ఒక వేళ ఆ వ్యక్తికి శాఖాహారిగా కొనసాగేందుకు ఆసక్తి ఉన్నట్లయితే.. జీవితం మొత్తం సరిపోయేలా సుమారు రూ.10 లక్షలు విలువ చేసే శాఖాహారాన్ని అందిస్తామని తెలిపారు.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నియామకాలు మొదలవ్వుతాయని, ఆసక్తికర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ విషయాలు గురించి తెలుసుకోండి...