నాగచైతన్య తన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమా షూటింగ్ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తీసిన ఫొటో అది. ఆ ఫొటో చైతూకు బాగా నచ్చింది. దాన్ని చైతూ ఇన్ స్టాలో షేర్ చేశాడు.చీకట్లో ఓ బెంచ్ పై కూర్చున్న నాగ చైతన్య, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టుగా ఈ పిక్ కనిపిస్తోంది.దీన్ని తొలుత చైతూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, దీన్ని పీసీ శ్రీరామ్ తీశారని, అటువంటి వ్యక్తితో పనిచేసే అవకాశం తనకు లభించడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నాడు. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో చైతు దీర్ఘాలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. దీంతో పలువురు నెటిజన్లు ఆ ఫొటోపై కామెంట్లు చేస్తున్నారు. చైతూ భార్య సమంత కూడా ఆ ఫొటోపై స్పందించింది."అరే... నా గురించే ఆలోచిస్తున్నావా?" అంటూ ఫన్నీ కామెంట్ చేసింది.సమంత కామెంట్ తరువాత ఈ పిక్ మరింతగా వైరల్ అయింది.
కాగా గత ఏడాది ఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చింది సమంత. ప్రస్తుతం సమంత తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం.. తమిళ్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాటువాకుల రెండడు కాదల్ మూవీల్లో నటిస్తోంది. వీటితో పాటు ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ వచ్చే నెలలో అమెజాన్లో విడుదల కానుంది.