మీకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు మీద తిరగాలని ఉందా? అయితే, మీరు ఈ భోజనాన్ని పూర్తిగా తింటే చాలు.. బుల్లెట్  బైక్ ని ఫ్రీగా  మీరు సొంతం చేసుకోవచ్చు... ఈ ఆఫర్ ఎదో బాగుందే అని అనుకుంటున్నారా .. భోజనం చేస్తే లక్ష రూపాయల విలువైన  బుల్లెట్ బైక్ ఇస్తారా .. ఇదేదో వెరైటీగా ఉందని  అనుకుంటున్నారా ? మరి ఈ హోటల్ ప్లేస్ ఎక్కడ, బైక్ గెలవాలంటే ఏమి చేయాలి మొదలైన  అన్ని విషయాలు తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవాలి .. ఇక వివరాలలోకి వెళ్తే.... ముందుగా మీరు ఆ ఆఫర్ ని పొందాలంటే  మహారాష్ట్రకు వెళ్లాల్సి ఉంటుంది.  పూణే లోని వాడ్గావ్ మావల్ ప్రాంతంలో గల ‘శివరాజ్ హోటల్’ ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. వీళ్ళు ఇలా ఆఫర్  ప్రకటించడం వెనకాల ఉన్న ముఖ్య కారణం  కరోనా వైరస్..

కరోనా వైరస్ నేపథ్యంలో హోటళ్ల బిజినెస్ ఎంతగా పడిపోయిందో మనందరికీ  తెలిసిందే.   మళ్లీ వ్యాపారం పుంజుకొనేందుకు వ్యాపారులందరు రకరకాల ఐడియాలతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే శివరాజ్ హోటల్ కూడా ‘బుల్లెట్ బైక్’ కాంటెస్ట్  ప్రకటించింది. ఈ ఆఫర్‌లో బైక్‌ను పొందాలంటే .. కస్టమర్లు కొన్ని షరతులు పాటించక తప్పదు ఆ హోటల్ వాళ్ళు పెట్టిన నియమాలకు లోబడి కాంటెస్ట్ లో పాల్గొని గెలిస్తే  బుల్లెట్ బైక్ మీ సొంతం అవుతుంది ..  

హోటల్ యాజమాన్యం ప్రకటించిన ఛాలెంజ్‌ను స్వీకరించి  60 నిమిషాల్లో పూర్తిగా తినేస్తే.. బుల్లెట్‌ను  సొంతం చేసుకోవచ్చు. అయితే  శివరాజ్ హోటల్ యజమాని అతుల్ వైకర్  పోస్టు చేసిన ఈ ప్రకటన చూసి కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. కస్టమర్ల కోసం అతుల్ ఐదు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను హోటల్ ముందు  ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాడు . మరి ఈ కాంటెస్ట్ లో ఎవరైనా గెలుపొందారు అనే సందేహం మీకు వచ్చిందా .. వచ్చే ఉంటుంది .. అయితే  సోలాపూర్‌కు చెందిన సోమ్‌నాథ్ పవర్  60 నిమిషాల లోపే హోటల్ వాళ్ళు పెట్టిన ఛాలెంజ్ లో గెలుపొంది ఎంచక్కా బుల్లెట్ ని  ఇంటికి  తీసుకువెళ్లాడు ..



మరింత సమాచారం తెలుసుకోండి: