దుబాయ్ అంటే వింతలకి మారు పేరు అనే చెప్పాలి .ఎత్తైన కట్టడాలు కానీ ఇంకా నీళ్ళల్లో నిర్మితమైన దీవి కానీ ఇలా అన్ని వింతలకి దుబాయ్ పెద్ద అడ్డాగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా ఇంకో వింత జరిగింది. మనం ఇప్పటి వరకు చికెన్ బిర్యానీ,ఫిష్ బిర్యానీ , ప్రాన్స్ బిర్యానీ ,మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ రుచులు ఇంకా నాన్ వెజ్ బిర్యానీకి సంబంధించిన రుచులు మాత్రమే చూసాము. వాటి గురించి మాత్రమే విని వున్నాము. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయే బిర్యానీ గురించి తెలిస్తే.. లొట్టలేయడం మరిచిపోయి.. వామ్మో అని గుండె పట్టుకుంటారు. ఎందుకంటే.. అది సాదాసీదా బిర్యానీ కాదు.. 23 క్యారెట్ల గోల్డ్‌తో తయారు చేసిన బంగారు బిర్యానీ అట.. బంగారు బిర్యానీయా? అని ఆశ్చర్య పోతున్నారా? అయితే ఈ స్టోరీ వినండి....


ఇక అరబ్ దేశం దుబాయ్ లోని దుబాయ్  ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC)లో గల లగర్జీ హోటల్‌.. ‘బొంబాయి బోరో’(Bombay Borough) తాజాగా ఈ ఖరీదైన రాయల్ గోల్డ్ బిర్యానీ తయారు చేసి అందరినీ నోరు వెళ్లబెట్టేలా చేసి ఆశ్చర్య పరిచింది...అయితే, అది బంగారంతో తయారు చేసిన బిర్యానీ కదా.. ఎలా తినగలం అనే సందేహం మీకు రావచ్చు. ఈ విషయంలో మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ 23 క్యారెట్ల బంగారాన్ని మీరు నమిలి తినేయొచ్చు. పైగా అది టేస్టీగా కూడా ఉంటుంది. DIFC స్పెషల్ యానివర్శరీ సెలబ్రేషన్లలో భాగంగా ఈ బిర్యానీ తయారు చేశారు.ఈ బిర్యానీని పెద్ద బంగారు పళ్లంలో పెట్టి మరీ వడ్డించడం గమనార్హం. బంగారు అప్రాన్, మెరిసే బంగారు చేతి గ్లవ్స్ తొడుకున్న ఇద్దరు క్యాటర్లు దీన్ని వడ్డించారు. అల్యూమినియం ఫాయిల్స్ (రేకులు) తరహాలోనే.. బంగారాన్ని కూడా ఫాయిల్స్‌గా మలిచారు.


వాటిని బిర్యానీలోని మటన్ ముక్కలు, రైస్ మీద పెట్టారు.ఇండియాలోని నాలుగు వేర్వేరు ప్రాంతాలను ప్రతిబించేలా నాలుగు రకాల బిర్యానీలను తయారు చేయడం గమనార్హం. ఇందులో హైదరాబాద్‌ బిర్యానీ కూడా ఉంది. ఈ గోల్డెన్ బిర్యానీని మీరు తినాలంటే.. ఒక ప్లేటుకు 1000 Dirham (భారత కరెన్సీలో రూ.19,742) చెల్లించాలట. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: