ఇక అరబ్ దేశం దుబాయ్ లోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC)లో గల లగర్జీ హోటల్.. ‘బొంబాయి బోరో’(Bombay Borough) తాజాగా ఈ ఖరీదైన రాయల్ గోల్డ్ బిర్యానీ తయారు చేసి అందరినీ నోరు వెళ్లబెట్టేలా చేసి ఆశ్చర్య పరిచింది...అయితే, అది బంగారంతో తయారు చేసిన బిర్యానీ కదా.. ఎలా తినగలం అనే సందేహం మీకు రావచ్చు. ఈ విషయంలో మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ 23 క్యారెట్ల బంగారాన్ని మీరు నమిలి తినేయొచ్చు. పైగా అది టేస్టీగా కూడా ఉంటుంది. DIFC స్పెషల్ యానివర్శరీ సెలబ్రేషన్లలో భాగంగా ఈ బిర్యానీ తయారు చేశారు.ఈ బిర్యానీని పెద్ద బంగారు పళ్లంలో పెట్టి మరీ వడ్డించడం గమనార్హం. బంగారు అప్రాన్, మెరిసే బంగారు చేతి గ్లవ్స్ తొడుకున్న ఇద్దరు క్యాటర్లు దీన్ని వడ్డించారు. అల్యూమినియం ఫాయిల్స్ (రేకులు) తరహాలోనే.. బంగారాన్ని కూడా ఫాయిల్స్గా మలిచారు.
వాటిని బిర్యానీలోని మటన్ ముక్కలు, రైస్ మీద పెట్టారు.ఇండియాలోని నాలుగు వేర్వేరు ప్రాంతాలను ప్రతిబించేలా నాలుగు రకాల బిర్యానీలను తయారు చేయడం గమనార్హం. ఇందులో హైదరాబాద్ బిర్యానీ కూడా ఉంది. ఈ గోల్డెన్ బిర్యానీని మీరు తినాలంటే.. ఒక ప్లేటుకు 1000 Dirham (భారత కరెన్సీలో రూ.19,742) చెల్లించాలట. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ విషయాలు గురించి తెలుసుకోండి...