ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు సినిమాలలో హీరోలు పులితో ఫైట్ చేసి దానిని ఓడించే సన్నివేశాలు చూస్తే భలే ఆశ్చర్యం కలిగేంది. అబ్బ హీరో కాబట్టే ఏకంగా పులినే ఓడించాడు అనుకుంటూ చప్పట్లు కొట్టేవాళ్లం. కానీ తాజాగా అలాంటి ఓ హీరో కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చాడు. అయితే ఇతడు రీల్ హీరో కాదు. రియల్ హీరో. నిజజీవితంలోనే ఏకంగా ఓ పులితో పోరాడడమే కాకుండా వట్టి చేతులతోనే దాని ప్రాణాలను కూడా తీశాడు. ప్రస్తుతం ఈ వార్త కర్ణాటక వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.

రాష్ట్రంలోని హసన్ జిల్లా, అరసికేరే మండలంలోని బెండేకరే తాండ వద్ద బంధువుల ఇంట్లో పెళ్లి కార్యక్రమానికి రాజ్ గోపాల్ నాయక్ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా హాజురయ్యాడు. కార్యక్రమంలో అయిపోవడంతో తన భార్య, కుమార్తె తో కలిసి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. ఇంతలో దారి మధ్యలోకి రాగానే హఠాత్తుగా ఓ చిరుత వారి కుటుంబంపై దాడి చేసింది. ఈ దాడిలో మొదటగా ఆ చిరుత రాజా గోపాల్ నాయక్ కుమార్తెపై దాడి చేసింది. ఆ తర్వాత అతడిపై కూడా చిరుత విరుచుకుపడింది. ఇక ఆ సమయంలో అతడు తనకు చావు తప్పదని అనుకున్నాడు. కానీ చనిపోతున్నానన్న భయంతో ఎక్కడలేని ధైర్యం అతడిలో వచ్చేసింది. వెంటనే చిరుతతో పోరాటానికి సిద్ధమయ్యాడు.

ఎలాగాలో ఆ చిరుత గొంతును అందిపుచ్చుకున్నాడు. గట్టిగా అదిమి పట్టుకున్నాడు. ఒక చేతితో చిరుత మెడను గట్టిగా పట్టుకుని రెండో చేత్తో దాని ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. దీంతో ఆ చిరుత అక్కడికక్కడే చనిపోయింది. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ పోరాటంలో కుటుంబ సభ్యులకి పెద్ద గాయాలే అయ్యాయి. తన కుటుంబ సభ్యుల ప్రాణాలు రక్షించుకోవాలన్న ఆలోచనతో తాను ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోయి చిరుతను చంపేశాడు. భార్య, బిడ్డను కాపాడుకున్నాడు. మరదే.. ‘పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులవుతుంది. మరి మనిషి కాలేడా..?

మరింత సమాచారం తెలుసుకోండి: