ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... దేశంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోతుంది. నిర్భయ, దిశా చట్టాలు వచ్చినా కాని అత్యాచారాలు ఆగటం లేదు... రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి..రోజు రోజుకి సమాజంలో దుర్మార్గులు ఎక్కువైపోతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే.. యువతులు, లవర్స్, పెళ్ళైన మహిళలను టార్గెట్ చేసి వాళ్ళని రేప్ చేస్తున్నారట దుర్మార్గులు..తమిళనాడులో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అండతో ఆ పార్టీ స్టూడెంట్ లీడర్స్, ఆ పార్టీ యువజన విభాగం నాయకులు ఇప్పటికే అరెస్టు అయ్యారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఈ గ్యాంగ్ రేప్ ముఠా ఇంతకాలం రెచ్చిపోవడం కలకలం రేపింది. కాలేజ్ అమ్మాయిలు, ప్రేమికులను బెదిరించి ప్రియురాళ్లను, వివాహిత మహిళలపై గ్యాంగ్ రేప్ లు చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. తమకు జరిగిన అన్యాయం గురించి నలుగురు బాధితులు సీబీఐ అధికారుల ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు.


కోయంబత్తూరు మహిళా కోర్టులో మరో యువతి రహ్యసంగా తన మీద రేప్ చేసిన వారి అనావళ్లతో పాటు కొందరి పేర్లు చెప్పి స్టేట్ మెంట్ ఇచ్చింది.కాలేజ్ అమ్మాయిలు, యువతులు, వివాహిత మహిళలపై సామూహిక అత్యాచారం చేసే సమయంలో కొందరు వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. అన్నా మమ్మల్ని వదిలేయండి, ఇక ముందు ఇటువైపురాము అంటూ ఆ యువతులు వేడుకుంటున్న ఆడియో టేపులు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్ అయ్యాయి.


పొల్లాచ్చి రేప్ కేసుల్లో అన్నాడీఎంకే పార్టీ విద్యార్థి విభాగం కార్యదర్శి అరులాతలం, షేక్ బాబు, హెరాన్ పాల్ తో పాటు మరో ముగ్గురిని సీబీఐ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. నలుగురు రేప్ కేసు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి సీబీఐ అధికారుల ముందు సాక్షం చెప్పడంతో శబరిరాజ్, సతీష్, వసంతకుమార్, తిరునావక్కరసు, మణివన్నన్ తో సహ మొత్తం 8 మందిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి విచారణ చేసి వాళ్లను జైలుకు పంపించారు. పొల్లాచ్చిలో పదేపదే గ్యాంగ్ రేపులు జరగడంతో స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యారు.ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: