రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయి చాలా ఏళ్ళు అయ్యింది. అయినా కూడా రెండో ప్రపంచ యుద్ధం నాటి చేదు గుర్తులు ఇంకా మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఆనాటి చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ కొన్ని దేశాలను వెంటాడుతూనే ఉన్నాయి.తాజాగా యూకేలోని ఎక్సటర్ నగరంలో సుమారు ఏడు దశబ్దాల కిందట జిర్మనీ విడిచిన వెయ్యి కిలోల బాంబు పేలకుండా అలాగే ఉంది. అయితే దాన్ని గమనించిన అధికారులు  దానివల్ల ఎప్పటికైనా స్థానికులకు ముప్పు ఉండవచ్చని భావించి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి మరింత  తెలుసుకుందాం.



ఈ సందర్భంగా అధికారులు ఆ బాంబు చుట్టుపక్కల నివసిస్తున్న ఖాళీ చేయించి.. పునరావాసం కల్పించారు. ఎక్సెటర్‌ యూనివర్శిటీ పక్కనే గల ఓ ప్రైవేట్ ల్యాండ్‌లో శుక్రవారం అనగా ఫిబ్రవరి 26 న ఈ బాంబును గుర్తించారు. వెయ్యి కిలోల బరువున్న ఆ బాంబు ఇంకా యాక్టీవ్‌గానే ఉంది. దానిపై ఒత్తిడి తెస్తే పేలిపోయే ప్రమాదం ఉందని భావించిన అధికారులు ఉన్న చోటులోనే పేల్చేయాలని నిర్ణయించుకున్నారు.


ఈ సందర్భంగా 400 మీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం బాంబును పేల్చేశారు. డెవాన్ అండ్ కార్న్‌వాల్ అండ్ పోలీస్ డ్రోన్స్ ఈ దృశ్యాలను డ్రోన్ కెమేరాల ద్వారా చిత్రీకరించారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పేలుడు ప్రభావానికి ఆ ప్రాంతంలో మూడు డబుల్ డెక్కర్ బస్సులు పట్టేంత గొయ్యి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. మొత్తం 2,600 మందిని పరిసరాల నుంచి ఖాళీ చేశామని తెలిపారు.


100 మీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లు బాంబుల దాటికి ధ్వంసమయ్యాయని, పునాదులు కదిలిపోయాయన్నారు. ఇళ్లను కోల్పోయిన ప్రజలకు మరామ్మతులు పూర్తయ్యేవరకు పునరావాసం కల్పిస్తామని తెలిపారు. బాంబు పేలుడు వల్ల ఏర్పడిన శిథిలాలు 250 మీటర్ల వరకు ఎగిరిపడ్డాయన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో 1942లో జర్మనీ బాంబర్లు ఎక్సెటర్‌ నగరంపై 19 సార్లు దాడి చేశాయి. సుమారు ఏడు వేల రకాల బాంబులను వేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: