అనాథ వ్యక్తులను ఆదుకునేందుకు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మున్సిపల్ సిబ్బంది, జిల్లా అధికారులు సంయుక్తంగా దీనబంధు పునరావాస యోజన ద్వారా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 24న కూడా అలాంటి కార్యక్రమమే నిర్వహించారు. అందులో బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించే దిశగా అనేకమందిని తమతో తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి మొత్తం 109 మంది అనాథలను తీసుకువచ్చారు. వీరికి తగిన వైద్య చికిత్స అందించారు. వారిలో ఓ వ్యక్తి రమేశ్. రమేష్ రెండేళ్లుగా ఓ ఆలయం వద్ద బిచ్చగాడిగా యాచన చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు.
అందరినీ అడుగుతున్నట్లే రమేశ్ను కూడా అధికారులు.. ‘నీవు ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చావు..? అని అడిగారు. రమేశ్ తన ఇంటి వివరాలు చెప్పాడు. అధికారులకు రమేష్ ఇచ్చిన సమాచారంతో ఆ అడ్రస్కు వెళ్లారు. ఆ ఇంటిని చూడగానే వారంతా షాకయ్యారు. ఆ ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. రమేష్కు ఒక సొంత భవనం, ప్లాట్ ఉన్నాయి. వాటి విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది. అయితే రమేష్కు ఉన్న ఒక్క అలవాటు అతనిని బిచ్చగానిగా మార్చివేసింది. అతని మద్యం అలవాటే అతనిని ఈ దుస్థితికి తీసుకువచ్చింది. విపరీతంగా మద్యం తాగే అలవాటు కారణంగా అతను ఆలయం దగ్గర బిచ్చమెత్తుకుంటూ కాలం గడుపుతున్నాడు.
రమేష్ పరిస్థితిని గమనించిన అధికారులు అతనికి కౌన్సెలింగ్ ఇప్పించారు. ప్రస్తుతం రమేష్ ఆరోగ్యం మెరుగుపడింది. తిరిగి రమేష్ తన ఇంటికి చేరుకున్నాడు.