టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కుల పిచ్చి మాత్రం పోవడం లేదు. పరువు ప్రతిష్ట కోసం కన్న బిడ్డల సంతోషాయాన్ని కూడా తల్లింతండ్రులు లెక్క చేయడం లేదు. నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని సంతోషం గా ఉండటం కంటే తమ కులానికి చెందిన వాణ్ణి పెళ్లి చేసుకుని ఎలా ఉన్నా పర్లేదని అనుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఓ జంటను అమ్మాయి తరుపు బంధువులు కిడ్నాప్ చేసేందుకు  భారీ స్కెచ్ వేశారు. కులాంతర వివాహం చేసుకున్నారన్న కోపంతో వధూ వరుల ను కిడ్నాప్ చేసేందుకు రెడీ అయ్యారు. వరుడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో వధువు కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది. పోలీసుల ఎంట్రీ తో గొడవ అంతా సద్దు మణిగింది ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...మేడి పల్లి మండలం గోవిందారం గ్రామంలో ఇద్దరు యువతీ యువకుల మధ్య పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్తా కొన్ని రోజులకు ప్రేమగా మారింది. దాంతో ఇద్దరూ చెట్టా పట్టాలేసుకుని తిరిగారు ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని అనుకున్నారు. దాంతో పెళ్లి చేసుకుని కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ కులాలు వేరు కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి నిరాకరించారు. దాంతో ప్రేమికులు ఇల్లు విడిచి పారిపోయారు. పారిపోయిన అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు తెలుస్తోంది. ఈ విషయం వధువు తల్లి తండ్రులకు తెలియగానే కోపంతో రగిలిపోయారు. ఇద్దరినీ విడదీసి తమ కూతురును తమతో తీసుకెళ్ళాలని అనుకున్నారు. దానికోసం కిడ్నాప్ స్కెచ్ వేశారు. అయితే ఈ విషయాన్ని వరుడు అతడి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు వెంటనే రంగం లోకి దిగి వధువు కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పారు. దాంతో గొడవ సద్దుమనిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: