ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ భారతదేశంలో విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.చైనా దేశం నుంచి పుట్టుకొచ్చిన ఈ కరోనా వైరస్ తో భారతదేశం అతలాకుతలం అవుతుంది.రోజుకి ఎన్నో లక్షల కేసులు నమోదవుతున్నాయి.ఎంతోమంది చనిపోతున్నారు.చాపకింద నీరు లాగా కరోనా సెకండ్ వేవ్ నలుమూలల వ్యాపిస్తుంది.  దేశంలో రోజుకి 4 లక్షల కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి.అలాగే మరణాలను అదుపు చెయ్యలేక డాక్టర్లు చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. జనాలు ఏం చెయ్యాలో తెలీక తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే అదుపు చెయ్యలేని పరిస్థితి నెలకొంది. ఇక ముంబై, చెన్నై, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో కరోనా మరణాలు ఎక్కువయ్యి డాక్టర్లు అదుపు తప్పి ఏడుస్తున్నారు .ఒక పక్క ప్రభుత్వాధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు.


అయితే ప్రభుత్వాలు, వైద్యాధికారులు మాస్కులు వేసుకోండి, సామాజిక దూరం పాటించమని సూచిస్తుంది. కరోనా మహమ్మారి నుంచి మనల్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మాస్కుని ధరించాలి. ఎందుకంటే మాస్కె మనకు రక్ష. మాస్కు లేకపోతే కరోనా చాలా సులభంగా సోకుతుంది. కాబట్టి ఖచ్చితంగా మాస్కుని ధరించాలి.అయితే చాలా మంది ఈ కరోనా ని చాలా ఫన్నీగా సెటైరికల్ గా తీసుకుంటున్నారు.అయితే మాస్కుని ధరించామన్నారు కదా అని ఏది పడితే అది దరిస్తున్నారు.ప్రస్తుతం ఈ వ్యక్తి ధరించిన మాస్క్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మనం మాములుగా చాలా మాస్కులని చూసి ఉంటాం. కాని ఈ వ్యక్తి ఏకంగా గోన పట్టాని మాస్క్ గా ధరించి అందరిని షాక్ కి గురి చేశాడు. ఈ మాస్కుని చూసి సోషల్ మీడియాలో అందరూ సెటైర్లు, జోక్స్ వేసుకుంటున్నారు.ఈ మాస్కుని చూసి కరోనా సైతం పారి పోవడం ఖాయమని నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింటా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: