తద్వారా ఎంతో మంది కరోనా వైరస్ బారినపడిన రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగానే పని చేసినప్పటికీ కేసుల సంఖ్య ప్రమాదకర రీతిలో పెరిగిపోవడంతో ఆక్సిజన్ కొరత కూడా మరింత ఎక్కువైంది. ఇప్పుడిప్పుడే దేశంలో పరిస్థితులు కాస్త అదుపులోకి వస్తున్నాయి. ఓవైపు వైరస్ కేసుల సంఖ్య తగ్గడం రికవరీ రేటు పెరగడమే కాదు.. ఆక్సిజన్ కొరత లేకుండా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది.
అయితే గతంలో కరోనా వైరస్ బారిన పడిన రోగులు ఆంబులెన్స్ లో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఇక ఇంటి నుండి ఆస్పత్రికి వెళ్లేంత వరకు కూడా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు బాధపడ్డారూ. ఇక ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు పాకెట్లో పట్టే ఒక మినీ వెంటిలేటర్ను తయారు చేసారు ఇక్కడ ఒక వ్యక్తి. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ డాక్టర్. రామచంద్ర లాల్ ముఖర్జీ రోగుల కోసం ఇక పాకెట్లో పట్టే వెంటిలేటర్ను తయారు చేసారు. శ్వాస సమస్యతో బాధపడుతున్న వారికి ఇంటి నుంచి ఆస్పత్రి వరకు మినీ వెంటిలేటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ వెంటిలేటర్ పేటెంట్ రైట్స్ కోసం అప్లై చేసుకున్నట్లు ఆయన తెలిపారు.