ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ ప్రకారం అనేక దేశాలలో ప్రతిచోటా ఏదో ఒక కొత్తది సృష్టించబడుతోంది. ఇక అలాంటి వాటిల్లో రోడ్రవాణాకూడా ఒకటి."ఖతార్" ప్రస్తుతం ఎక్కడ చూసినా మన రోడ్లు నల్ల రంగులోనే కనిపిస్తుంటాయి. కానీ"ఖతార్" లో మాత్రం అక్కడ రోడ్లు నీలిరంగులో నిర్మిస్తున్నారట. ఆ రోడ్లను  అలా ఎందుకు నిర్మిస్తున్నారో ఒకసారి చూద్దాం.
ఖతార్ ఇండియా నుంచి పడమరవైపు దిశగా ఉన్న సౌదీ అరేబియాకు దగ్గరగా ఉంటుంది. ఈ దేశం మొత్తం భాగం సముద్రం లోనే ఉంటుంది. ఈ ఖతార్ కి క్యాపిటల్ "దోహద్". ఈ దేశంలోని మనిషి యొక్క జీవితకాలం దాదాపుగా 70 సంవత్సరాలు ఉంటుంది. ఈ దేశం ఎక్కువగా ఇసుక దిబ్బలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా దొరికేది పెట్రోలియం, సహజసిద్ధమైన గ్యాస్, ఎక్కువగా లభిస్తాయి.

ఈ దేశంలో మొత్తం వ్యవసాయ భాగం 5.6 భాగమే. మిగతా భాగమంతా ఇసుకతో నిండి ఉంటుంది. ఈ దేశానికి UK నుంచి 1971 సెప్టెంబర్ 3వ తేదీన స్వతంత్రం వచ్చింది. ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా క్రౌడ్ ఆయిల్, పెద్ద పెద్ద ఓడలు తయారీ సంస్థలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ దేశంలోని ప్రజలు ఎక్కువగా ఇంటర్నెట్ ను ఉపయోగిస్తుంటారు. ఖతార్ ని ఎక్కువగా "ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునుటీ "అని పిలుస్తారు. ఈ దేశం  30 బిలియన్ డాలర్ లు రవాణా శాఖ  అభివృద్ధికి ఖర్చు పెట్టింది.
ఖతార్ లో ఇప్పుడు ప్రయోగాత్మకంగా బ్లూ రోడ్లను వేస్తున్నారు. ఇలా ఎందుకు వేశారంటే ? సాధారణంగా అరబ్ దేశాలలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండడంతో.. అక్కడి రోడ్లు కరిగి పాడై పోతున్నాయి. ఇలా రోడ్లు సరిగా లేకపోవడంతో వాహనాలు దెబ్బతింటున్నాయి. ఇలా సమస్యలన్నిటినీ పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే.. ఒక ప్రత్యేక పదార్థం తో తయారైన నీలిరంగు రోడ్లను ప్రయోగాత్మకంగా వేస్తున్నారు. ముందుగా"ఖతార్" రాజధాని దోహద్ లో ఈ రోడ్లను వేస్తున్నారు. ఈ రోడ్లను పైలెట్ ప్రాజెక్టుగా నీలిరంగు ఉపరితలం ఉన్న రోడ్ల పనితీరును పరిశీలిస్తున్నారు. సాధారణ నల్లని రోడ్ల తో పోలిస్తే.. ఈ నీలి రంగు ఉన్న రోడ్లు సూర్యరశ్మిని చాలా తక్కువగా ఆకర్షిస్తాయని తెలిపారు.


ఈ నీలి రంగు రోడ్ల వల్ల రోడ్లు ఎక్కువగా వేడెక్కడం లేదు. ఈ రంగు రోడ్ల వల్ల 50 శాతం ఉన్న ఉష్ణోగ్రత 10 నుంచి 20 వరకూ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంతేకాకుండా రాబోయే 2022 వరల్డ్ కప్ క్రికెట్ క్రీడకు ఆదిత్యమిస్తున్న ఖతార్ ఇప్పటికే ఏర్పాట్లను మొదలు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: