న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పింపుల్ బ్యూటీ చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా వాటితో స్పష్టంగా తనకంటూ ఓ ముద్రను వేసుకున్నారు. ఇక డ్యాన్సులైనా, నటనలోనైనా సాయి పల్లవిని ఇప్పుడున్న హీరోయిన్స్ మ్యాచ్ చేయడం చాలా కష్టం. పల్లవి ముందు పెద్ద హీరోలు కూడా తక్కువైపోతుంటారు.అందుకే సాయి పల్లవికి తెర వెనుకా ఎంతో మంది అభిమానులున్నారు. ఇక సినిమాల్లోని తన ప్రదర్శన ద్వారానే కాకుండా ఆమె యాటిట్యూడ్, ప్రవర్తన, మాట తీరుకు చాలా మంది అభిమానులున్నారు.

ఇక సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా డబ్బుల కోసం మాత్రమే ఏది పడితే ఆ ప్రాజెక్ట్‌లను అంగీకరించరు. కేవలం ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్పా సినిమాలకు ఓకే చెప్పదు. ఇక అలాగే సౌందర్య ఉత్పత్తుల ప్రకటనలకు కూడా సాయి ఆమడ దూరంలో ఉంటారు. ఏకంగా తనకు రెండు కోట్ల ఆఫర్ వచ్చినా కూడా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌కు సాయి పల్లవి నో చెప్పారు. అలా తన సొంత నిర్ణయాలతో సాయి పల్లవి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు.

అయితే న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ సోషల్ మీడియాలో కూడా మరీ అంత యాక్టివ్‌గా ఉండరు. ఎప్పుడో ఒకసారి ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఇక సినిమా అప్డేట్లే కాకుండా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఇందులో ఆమె చేతికి, కాళ్లకు గోరింటాకు పెట్టుకున్నారు. అయితే సందర్భం ఏంటో చెప్పలేదు కానీ.. తన గోరింటాకును చూసి ఈ పింపుల్ బ్యూటీ తెగ మురిసిపోతోన్నారు. ఇక తన కుడి చేతికి మాత్రం మెహిందీ పెట్టుకోలేదని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో నానితో శ్యామ్ సింఘరాయ్, రానాతో విరాట పర్వం వంటి విభిన్న సినిమాలతో త్వరలో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: