తమిళ స్టార్ అజిత్ అంటే, ఈయనకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకి తెలిసిందే. ఇక ఆయన నటించే సినిమాకు సంబంధించిన ఏదైనా సినిమా పోస్టర్ గాని, టీజర్ గాని విడుదల అయింది అంటే , అప్పటి వరకు ఉన్న అన్ని  రికార్డులను బ్రేక్ చేసేందుకే , ఆయన  అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అయితే ఈయన తన దగ్గర ఉన్న  బైక్ తో విహార యాత్ర కు వెళ్ళాడట. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

అజిత్ మొదట మెకానిక్ గా పని చేశాడు. దాంతో ఆయనకు బైకులపై మక్కువ ఏర్పడింది. ఇక ఎక్కువగా రేసింగ్ లో కూడా పాల్గొంటాడు. ఈ విషయాలను ఆయనే కొన్ని ఇంటర్వ్యూలలో తెలిపాడు. ఇక అంతే కాకుండా ఈయన  హీరోగా కూడా మంచి గుర్తింపు సంపాదించాడు. ఇకపోతే అజిత్ ఈ సంవత్సరం లో బైక్ పై నార్త్ ఇండియా కు విహార  యాత్రకు వెళ్ళాడు. ఇక ఈ బైక్ పై  2021 జనవరి లో సిక్కిం కు వెళ్ళినప్పుడు, అక్కడ  తీసుకున్న బైక్ మీద ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా , ప్రస్తుతం ఇవి నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక ఈ సంవత్సరం తన మిత్రులతో కలిసి అజిత్ విహారయాత్రకు వెళ్ళినప్పుడు, అక్కడ కేవలం కొన్ని రోజుల సమయంలోనే  దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించారట.
ఇంకా చెప్పాలంటే అజిత్ కి బైక్ డ్రైవింగ్ లేదా కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన బైక్ మీద నార్త్ ఇండియా మొత్తం చూడడానికి వెళ్ళాడు. అంతేకాదు ఫిబ్రవరిలో కోల్ కత్తా లో సైక్లింగ్ కూడా చేయడం జరిగింది. ఇక ఆయన ఎంతో ఇష్టపడి తీసుకున్న లగ్జరీ బైక్ మీద కూర్చుని, కొన్ని ఫోటోలను తీసి వాటిని ఇంటర్నెట్లో వదిలాడు. ఇక ఈ ఫోటోలను చూసిన ఆయన అభిమానులు ఆశ్చర్యంతో పాటు ఆనందానికి గురి అవుతున్నారు.
ఇక అజిత్ నటించిన వాలిమై చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను , చిత్ర నిర్మాత బోనీ కపూర్ విడుదల చేశాడు. ఇక ఆయన అభిమానులు గత రెండు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తుండగా, ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో అది యూట్యూబ్ లో 10 మిలియన్ల వ్యూస్ nunనమోదు చేసుకుంది.. ఈ సందర్భంగా నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ.." చిత్తశుద్ధితో పనిచేసి దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడి, ఈ పోస్టర్ ను విడుదల చేశాము. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వాలిమైడే, అజిత్ కుమార్, హెచ్ వినోద్, సురేష్ చంద్ర , నీరవ్ షా వంటి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు" అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: