మనలో చాలా మంది బస్సులో ట్రైన్ లో జర్నీ చేసే ఉంటాం. చాలా మంది జర్నీల సమయంలో చాలా అడ్వెంచర్లు చేస్తారు. కొన్ని కొన్ని సార్లు వాళ్లు చేసే అడ్వెంచర్ల వల్ల ప్రాణాలు కూడా కోల్పోతారు. కానీ ప్రస్తుతం ఓ మహిళ రైలెక్కేటపుడు చేసిన పనిని చూస్తే నవ్వాపుకోలేరు. అదే సమయంలో ఆ మహిళకు ఏదైనా ప్రమాదం సంభవిస్తుందో ఏమో అని కూడా కంగారు పడతారు. ఇలా ఉన్న ఈ వీడియో గురించి తెలుసుకుందాం.

ఎవరైనా సరే బస్సులో కానీ రైలులో కానీ ప్రయాణం చేసేటపుడు ఎలా లోపలికి ఎక్కుతారని అడగితే సాధారణంగా వాటికి ఉండే మెయిన్ డోర్ మెట్ల గుండా ఎక్కుతామని చెబుతారు. డైలీ బస్సులలో ప్రయాణించే కొంత మంది విద్యార్థులు బస్సులు రన్నింగ్ లో ఎక్కుతుండడం మనం చాలా సార్లు చూసే ఉంటాం. ఇలా ఎక్కుతున్నంత సేపు వారికి ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అని కంగారు పడుతూ ఉంటాం. కానీ ఎక్కేవారు అవేమీ పట్టించుకోకుండా తాపీగా ఎక్కుతారు. ఇంకా కొంత మంది బస్సుల్లో కిటికీల గుండా కూడా ఎక్కుతారు. బస్సులు ఆగి ఉన్నపుడు మెయిన్ డోర్ గుండా ఎక్కువ మంది ఎక్కుతూ ఉంటే త్వరగా లోపలికి ప్రవేశించి సీటు సంపాధించే క్రమంలో ఇలా కిటికీల గుండా ఎక్కేవారిని చూసి ఉంటాం.



ఎక్కువగా మగవారే ఇటువంటి ఫీట్లు చేస్తుంటారు. కానీ చాలా ప్రదేశాల్లో ఆడవారు ఇటువంటి సాహసాల జోలికి పోరు. కానీ ఒక చోట మాత్రం వింతగా ఓ మహిళ అదీ రైలులో కిటికీ గుండా ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. అదీ రైలుకు ఉండే ఎమర్జెన్సీ విండో ద్వారా ఆమె లోపలికి ప్రవేశించడంతో బోగీలో ఉన్నవారందరూ నోరెళ్లబెట్టారు. ఇలా మహిళ కిటికీ గుండా లోపలికి ఎక్కుతున్నపుడు కొంత మంది వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది. కాగా ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 64,057 మంది నెటిజన్లు వీక్షించారు. ఇలా ఈ వీడియోను చూసిన వారందరూ ఆశ్చర్యపోతూ ఫన్నీ కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: