విశ్వనటుడు కమల్ హాసన్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అంతలా అతడు తన నటనతో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులను సంపాధించుకున్నారు. కమల్ హాసన్ కు వివిధ దేశాల్లో కూడా వీరాభిమానులు ఉండడం విశేషం. తాజాగా ఈ విశ్వనటుడు తమిళనాడులో రాజకీయ పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన పార్టీకి అనుకున్న ఫలితాలు రాలేదు. దీంతో కమల్ కాస్త నిరాశ చెందాడనే చెప్పొచ్చు.


ఇక ఆయన నటించిన విశ్వరూపం సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ మూవీలో కమల్ పోరాటాలు చూసి అందరూ షాక్ తిన్నారు . ఆ మూవీలో పావురాలను ఉపయోగించి పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా సినిమాలో పావురాలను ఉపయోగించుకుని ఉగ్రవాదులు సంభాషించుకోవడం మనమందరం చూశం. కానీ ప్రస్తుతం మన దేశంలో సేమ్ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాకిస్తాన్ దేశ సరిహద్దు ప్రాంతమైన రాజస్థాన్ లో నిఘా వర్గాల కంట ఓ పావురం పడింది. దానిని పరిశీలించి చూడగా... దానిపై ఓ ఫోన్ నంబర్ రాసి ఉంది. అలా ఫోన్ నంబర్ రాసి ఉండడం చూసి ఆశ్చర్యపోయిన నిఘా వర్గాలు అసలు ఆ ఫోన్ నంబర్ ఎక్కడిదని ఎంక్వైరీ చేయగా.. అది పాకిస్తాన్ ది అని తెలిసింది. అంతే కాకుండా పావురం ఈక మీద అక్టోబర్ అని కూడా రాసి ఉండడం గమనార్హం. ఇలా అక్టోబర్ అని రాసి ఉండడంతో ఆ నెలలో ఏవైనా దాడులకు ప్లాన్ చేశారా అనే కోణంలో నిఘా వర్గాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. అంతే కాకుండా ఈ రాతలు ఎవరైనా ప్రేమికుల కోడ్ భాషా? అనే విషయంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నాయి. ఏదేమైనా ఇలా పావురం ఈకకు నంబర్ ఉండడం అందరినీ కలవరపాటుకు గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: