మాములుగా అందరూ కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించాలి అని అనుకుంటారు. మంచి ఉద్యోగం వచ్చి జీతం బాగుంటే వారి సంతోషానికి అవధులు ఉండవు. ఈ రోజుల్లో 25 వేలు జీతం కలిగిన జాబ్ దొరకాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని, తీరా జాబ్ వచ్చాక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. అయితే తాజాగా ఒక కంపెనీ కేవలం పడుకుని టీవీ చూస్తూ ఉంటే చాలు లక్షల్లో జీతం ఇస్తానని అంటోంది. అదేంటి అవాక్కయ్యారా? నిజమేనండి... అయితే పూర్తి వివరాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

ఇంగ్లాండ్ లోని ఒక కంపెనీ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ కంపెనీ వివరాల ప్రకారం వారి వద్ద ఉండే లగ్జరీ క్రాఫ్టెడ్ బెడ్స్ కు ప్రకటన ఇవ్వడానికి అని తెలుస్తోంది. అయితే ఈ ప్రకటనకు సెలెక్ట్ అయిన అభ్యర్థి రోజులో ఆరు నుండి ఏడు గంటల వరకు బెడ్ పై పడుకొని టీవీ చూడాల్సి ఉంటుంది. దీన్ని వింటుంటే చాలా హాయిగా ఉంది కదా... కంపెనీ చెప్పిన ప్రకారం ఇలా చేసినందుకు కాను జీతంగా మన దేశ కరెన్సీ ప్రకారం 25 లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఇందులో ఉద్యోగి ప్రతి రోజూ బెడ్ లను టెస్ట్ చేస్తూ ఉండాలి. ఏ బెడ్ ఎక్కువ నాణ్యత కలిగి ఉందో ఒక రికార్డు చేయాలి. అయితే ఆఫీస్ కు కూడా వచ్చే అవసరం లేకుండా సదరు కంపెనీ బెడ్ మరియు దిండ్లను ఇంటికి పంపుతుందని తెలుస్తోంది.

మొత్తానికి అక్కడ ఉన్న బెడ్ లు మరియు దిండ్ల గురించి ఏ ప్రశ్న అడిగినా దానికి సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కరోనా కారణంగా ఎంతో మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అందుకే ఈ కంపెనీ అలంటి వారి కోసం ఈ అవకాశాన్ని కల్పించింది. దీనికి సంబంధించిన ప్రకటన ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఈహతే ఇలాంటిది ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: