కొద్దిరోజుల కిందట ప్రపంచాన్ని వైరస్ అనే మహమ్మారి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. ఇక అందుకోసం ప్రభుత్వాలు శాయశక్తుల కష్టపడి వాటికి కొంత విరుగుడుగా మందు కనిపెట్టి, ప్రజలకు ఉచితంగా అందించారు. ఈ వైరస్ బారిన పడిన వారు చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా కొంతమంది పరిశోధకులు తెలిపిన ప్రకారం ఇలా చేస్తే కరోనా సోకిన తరువాత అది తగ్గుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.

కరోనా వైరస్.. ఎవరికి ఏ విధంగా సోకుతుందో తెలియడం లేదు. గత సంవత్సరం చైనాలోని పూహాన్ అనే ప్రాంతం నుంచి ఇది వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ ఎటువంటి వారికైనా సోకుతుంది. ఈ వైరస్ వల్ల ఎంతో మంది ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. ఈ వైరస్ సోకిన వారు కూడా ఇప్పటికీ చాలానే ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ పూర్తిగా కట్టడిచేసే వ్యాక్సిన్ ఇంకా సరిగ్గా అందుబాటులోకి రాలేదు.


అయితే కరోనా సోకిన వ్యక్తి, తన ప్రాణాలను కాపాడుకోవాలి అంటే, రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ముఖ్యమని కొంతమంది నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఇలా రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి మన శరీరానికి సహాయపడేది నిద్ర అని కూడా నిపుణులు తెలియజేస్తున్నారు. అది ఎలా చేస్తుందో వివరణ కూడా ఇవ్వడం జరిగింది.

మనం నిద్రిస్తున్నప్పుడు.. వైరస్ కణాలన్నిటిని చంపేవి తెల్ల రక్త కణాలు. మనం ఎక్కువ సేపు బాగా నిద్ర పోవడం వల్ల, అవి మన శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అప్పుడు ఆ వైరస్ ఎదుర్కొనే సత్తా తెల్ల రక్తకణాలకు వస్తోందట. మనం వైరస్ బారిన పడిన రోజులో కనీసం 9 గంటల సేపైనా నిద్రపోవాలని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఎలాంటి వైరస్ కైనా చెక్ పెట్టవచ్చునని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరి తో పాటు పుష్టికరమైన పోషకాహారం మంచిదని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: