ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు చాలా వెరైటీగా చేసుకుంటున్నారు. ఈ పెళ్లిలో నూతన వధువు పెళ్ళికి ముందే నా కోరిక తీర్చాలని పట్టుబట్టి మరీ కోరిక తీర్చుకుంది. అది కూడా పెళ్లి కొడుకుతో పెద్దల సమక్షంలో అంగీకారం తీసుకుని మరి తన ముచ్చట్లను తీర్చుకుంది. దీంతో చూసినవాళ్లంతా  ముక్కున వేసుకుని కూర్చున్నారు. ఇంతకీ ఆ పెళ్లి కూతురు ఏం చేసింది. ఎలా చేసిందో తెలుసుకుందామా..? ప్రస్తుత కాలంలో పెళ్ళిళ్ళు వెరైటీగా జరుగుతుండడం చూస్తున్నాం. కానీ పెళ్లి మండపాలకు వచ్చేటువంటి వధూవరులు తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ మధ్యనే ఓ పెళ్లి ఊరేగింపులో పెళ్లి కూతురు నీ బుల్లెట్ బండి ఎక్కి వస్తానని పాట సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా వైరల్ అయిపోయింది. సేమ్ అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కానీ ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏమిటంటే వధువు తన కోరిక మేరకు పెళ్లి మండపానికి తన స్కూటర్ పైనే వచ్చింది. అది కూడా ఒంటరిగా కాదు.

 తనను చేసుకోబోయే పెళ్లి కొడుకుతో తన సొంత బండి యాక్టివా నడుపుకుంటూ వెనుక పెళ్ళికొడుకుని కూర్చోబెట్టుకొని పెళ్లి మండపానికి తీసుకువచ్చింది. దీంతో వరుడిని వధువు తీసుకురావడం ఏంటని పెళ్లికి వచ్చిన వారంతా చాలా ఆశ్చర్యంగా చూశారు. పూర్తి వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ నగరంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి కూతురు పేరు నీలు దుమామి, నీముచ్ నగరంలో నివాసం ఉంటారు.

తండ్రి బ్లముకుంద్  ఈమెకు మనస్ ప్రాంతానికి  చెందిన అర్జున్ తో జనవరి 16న పెళ్లి జరిగినది. ఈ పెళ్లి వేడుక నీముచులోని కళ్యానేశ్వర దేవాలయం సమీపంలోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే పెళ్లి కూతురు  మండపానికి తన స్కూటర్ పై వస్తానని ముచ్చటపడింది. దీంతో పెద్దలు అంగీకరించారు. ఇంకేముంది తనకు కాబోయే భర్తను స్కూటర్పై వెనక సీట్ లో ఎక్కించుకొని నేరుగా పెళ్లి దుస్తులలో కల్యాణ మండపానికి వచ్చింది. ఈ వెరైటీ ఘటన చూసినటువంటి బంధువులు ఆశ్చర్యపోయారు. ఇది కాస్త సోషల్ మీడియాలో మాత్రం  విపరీతంగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: