కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఆలొచన వుంటే ఏదైనా సాధిస్తారు. ఇప్పుడు పెద్దగా చదువుకొక పోయిన కూడా చాలా మంది కొత్త ఆలోచనల తో కొన్ని చేస్తూ జనాలను ఔరా అనిపిస్తున్నారు. చాలా మంది ఇప్పుడు ఇలా సెలెబ్రిటీలు అవుతూన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. అలాంటి ఆలోచన అతనికి రావడం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..



వివరాల్లొకి వెళితే.. అతను ఒక ఆటో డ్రైవర్ చదివింది తక్కువే కానీ అతని ఆలోచనలు మాత్రం హైలెవల్ అనే చెప్పాలి.తన ఆటో లో కస్టమర్లను ఆకర్షించేందుకు లగ్జరీ కార్ల లో సైతం లభించని సౌకర్యాలు కల్పించాడు. మెట్రో ట్రైన్‌లో కూడా ఇలాంటి సౌకర్యాలు లభించవంటే నమ్మాలి. అది నిజమే అతని ఆలోచన బాగుంది అంటూ అతని ఆటో ఎక్కిన వాళ్ళు అంటున్నారు.అతని ఆటోలో కస్టమర్ల కోసం ఫ్రీ వైఫై, టీవీ, ల్యాబ్, ల్యాప్‌లాప్‌, న్యూస్‌ పేపర్స్‌, మ్యాగజైన్స్ ఇలా సామాన్యుడినుంచి బిజినెస్‌ మెన్ వరకూ అందరికీ ఉపయోగపడే సదుపాయాలు కల్పించాడు.. 



ఇది నిజంగానే గ్రేట్ అని మెచ్చుకొవాలి. ఆటోలో ప్రయానిస్తున్న అంత సేపు ఆటో లో వెళ్తున్న వాళ్ళు వాటిని ఉపయోగించుకోవచ్చు అని అంటున్నారు. అంతేకాదండోయో మధ్య లో ఆకలేస్తే తినడానికి స్నాక్స్‌ కూడా ఏర్పాటు చేశాడు.. ఈ ఆలోచన అందరికి రాదనె  చెప్పాలి. బిజినెస్‌ చేయాలంటే డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదని రుజువు చేసాడు. ఇది చెన్నై లో వెలుగు చూసింది.ఆటో-రిక్షా డ్రైవర్ అన్నా దురై వ్యాపారవేత్త అవ్వాలని చిన్నప్పటి నుంచి ఆలోచించె వాడు.. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల అలాంటివి చేయలేక పోయాడు. పెద్దగా చదువుకోలేక పోయాడు. ఇప్పుడు సోషల్ మీడియా లో సెలెబ్రిటీ అయ్యాడు. ఇతని ఆలోచన పై ప్రసంసలు కురుస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: